బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి తెలుగులో భారీ భారీ సినిమాలే చేశాడు. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్తో ‘అల్లుడు శీను’ అనే పెద్ద బడ్జెట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను లాంటి మరో స్టార్ డైరెక్టర్తో ‘జయ జానకి నాయక’ చేశాడు. శ్రీవాస్తో చేసిన ‘సాక్ష్యం’ సైతం పెద్ద బడ్జెట్ మూవీనే. ఈ సినిమాల వెనుక ఉండి శ్రీనివాస్ను నడిపించింది తండ్రి బెల్లంకొండ సురేషే.
తెలుగులో శ్రీనివాస్ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడా అంటే ఔనని అనలేం.. అలా అని అతణ్ని తీసిపడేయలేం. మాస్ను అతను ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. కొంత ఫాలోయింగ్ సంపాదించాడు. ఐతే ఆశ్చర్యకరంగా శ్రీనివాస్ తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి అనూహ్యమైన ఆదరణ దక్కించుకున్నాయి. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లో. ఈ పాపులారిటీతోనే శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా వినాయకే దర్శకుడు.
ఈ సినిమా ఈ శుక్రవారమే హిందీలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సురేష్ తన పుత్రోత్సాహాన్ని చాటాడు మీడియా ముందు. “ఒక టాలీవుడ్ హీరోతో జయంతి లాల్ గాడా లాంటి టాప్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ 60 కోట్లు పెట్టి సినిమా తీయడం.. మా వాడిని హీరోగా ప్రమోట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. శ్రీనివాస్ సినిమాలు యూట్యూబ్లో 500 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకున్నాయి. ఒక సినిమాకు 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఆదరణ చూసే గాడా గారు మా అబ్బాయిని హిందీలో హీరోగా పరిచయం చేయడానికి ముందుకు వచ్చారు. పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోట్ చేయడానికి మా అబ్బాయి పాట్నా, లక్నో లాంటి సిటీలకు వెళ్తుంటే జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఒక తెలుగు స్టార్ హీరోకు నార్త్ ఇండియాలో ఇలాంటి ఆదరణ దక్కడం గొప్ప విషయం. ఒక తండ్రిగా నేను ఇందుకు గర్వపడుతున్నా” అని సురేష్ తెలిపాడు.
This post was last modified on May 11, 2023 2:07 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…