అక్కినేని నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ గా నటించాడు. విలన్ ను కాపాడటమే హీరో లక్ష్యమని అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుందని దర్శకుడు చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కాస్త ఫాస్ట్ గానే ఫినిష్ చేశారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వచ్చే సరికి ఎప్పటిలానే టీం ఉరుకులు పరుగులు పెడుతూ వర్క్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైమ్ లో బై లింగ్వెల్ సినిమా కష్టాలన్నీ తెలిసొచ్చాయని వెంకట్ ప్రభు తెలిపాడు. అటు చెన్నై ఇటు హైదరాబాద్ తిరుగుతూ నిద్ర లేకుండా పనిచేస్తున్నానని తెలిపాడు. కస్టడీ టీం ను ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే వీఎఫ్ఎక్స్. సినిమాలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ చాలా ఉందట. దానికోసమే ఫస్ట్ కాపీ ఆలస్యమైందని తాజాగా నిర్మాత తెలిపారు. దీంతో ఓవర్సీస్ కి కంటెంట్ కాస్త ఆలస్యంగా చేరింది. నిన్న రాత్రి కంటెంట్ లోడ్ చేశారు.
ఇదంతా చూస్తుంటే ఈ బై లింగ్వెల్ సినిమా కోసం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చాలా కష్టాలు పడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారని అర్థమవుతుంది. ఏదేమైనా షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేకర్స్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగింది. సురేందర్ రెడ్డి వారం పాటు మీడియాకి కనిపించకుండా ప్రమోషన్స్ కి దూరమై వర్క్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాల్సి వచ్చింది. మిగతా దర్శక నిర్మాతలకి ఇవన్నీ చక్కని పాఠాలే.
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…