అక్కినేని నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ గా నటించాడు. విలన్ ను కాపాడటమే హీరో లక్ష్యమని అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుందని దర్శకుడు చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కాస్త ఫాస్ట్ గానే ఫినిష్ చేశారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వచ్చే సరికి ఎప్పటిలానే టీం ఉరుకులు పరుగులు పెడుతూ వర్క్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైమ్ లో బై లింగ్వెల్ సినిమా కష్టాలన్నీ తెలిసొచ్చాయని వెంకట్ ప్రభు తెలిపాడు. అటు చెన్నై ఇటు హైదరాబాద్ తిరుగుతూ నిద్ర లేకుండా పనిచేస్తున్నానని తెలిపాడు. కస్టడీ టీం ను ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే వీఎఫ్ఎక్స్. సినిమాలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ చాలా ఉందట. దానికోసమే ఫస్ట్ కాపీ ఆలస్యమైందని తాజాగా నిర్మాత తెలిపారు. దీంతో ఓవర్సీస్ కి కంటెంట్ కాస్త ఆలస్యంగా చేరింది. నిన్న రాత్రి కంటెంట్ లోడ్ చేశారు.
ఇదంతా చూస్తుంటే ఈ బై లింగ్వెల్ సినిమా కోసం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చాలా కష్టాలు పడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారని అర్థమవుతుంది. ఏదేమైనా షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేకర్స్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగింది. సురేందర్ రెడ్డి వారం పాటు మీడియాకి కనిపించకుండా ప్రమోషన్స్ కి దూరమై వర్క్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాల్సి వచ్చింది. మిగతా దర్శక నిర్మాతలకి ఇవన్నీ చక్కని పాఠాలే.
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…