అక్కినేని నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ గా నటించాడు. విలన్ ను కాపాడటమే హీరో లక్ష్యమని అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుందని దర్శకుడు చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కాస్త ఫాస్ట్ గానే ఫినిష్ చేశారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వచ్చే సరికి ఎప్పటిలానే టీం ఉరుకులు పరుగులు పెడుతూ వర్క్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైమ్ లో బై లింగ్వెల్ సినిమా కష్టాలన్నీ తెలిసొచ్చాయని వెంకట్ ప్రభు తెలిపాడు. అటు చెన్నై ఇటు హైదరాబాద్ తిరుగుతూ నిద్ర లేకుండా పనిచేస్తున్నానని తెలిపాడు. కస్టడీ టీం ను ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే వీఎఫ్ఎక్స్. సినిమాలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ చాలా ఉందట. దానికోసమే ఫస్ట్ కాపీ ఆలస్యమైందని తాజాగా నిర్మాత తెలిపారు. దీంతో ఓవర్సీస్ కి కంటెంట్ కాస్త ఆలస్యంగా చేరింది. నిన్న రాత్రి కంటెంట్ లోడ్ చేశారు.
ఇదంతా చూస్తుంటే ఈ బై లింగ్వెల్ సినిమా కోసం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చాలా కష్టాలు పడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారని అర్థమవుతుంది. ఏదేమైనా షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మేకర్స్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగింది. సురేందర్ రెడ్డి వారం పాటు మీడియాకి కనిపించకుండా ప్రమోషన్స్ కి దూరమై వర్క్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాల్సి వచ్చింది. మిగతా దర్శక నిర్మాతలకి ఇవన్నీ చక్కని పాఠాలే.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని…
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…
విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది…
పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు…
తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన…
రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7…