కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో తీవ్ర చర్చలకు దారి తీసిన ది కేరళ స్టోరీ మీద కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు విపరీతమైన ఆందోళనకు దారి తీస్తోంది. తమిళనాడు దీన్ని ముందే నిషేదించగా పశ్చిమ బెంగాల్ బ్యాన్ చేయడమే కాక గతంలో వచ్చిన కాంట్రావర్సి మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ ని ఉదహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నిప్పుని ఇంకా రగిలించింది. కేరళ మల్టీప్లెక్సులు మొదటి రోజు నుంచే ప్రదర్శనలు ఆపేయగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా షోలు జరిగిపోతున్నాయి. ఇక్కడే ఇబ్బంది లేదు
బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లు ఏకంగా పన్ను మినహాయింపులిచ్చాయి. ఎల్లుండి యుపి సిఎం యోగి ఆదిత్య నాధ్ ప్రత్యేకంగా ప్రీమియర్ చూడబోతున్నారు. ఇలా ఈ సినిమాకు రాజకీయ రంగు పులుముకోవడంతో అన్ని పార్టీలు దీన్నో ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నాయి. అయితే ఇలా గవర్నమెంట్లే స్వయంగా నిషేధాలకు పిలుపునివ్వడం పట్ల ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ వచ్చినవాటిని ఇలా అడ్డుకోవడం చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని ఒక నోట్ విడుదల చేశాయి
రోజుకో పరిణామంతో ది కేరళ స్టోరీ తెరమీదతో పాటు బయట అంతకన్నా సెన్సేషన్లు చేస్తోంది. 15న సుప్రీమ్ కోర్టులో కేరళ సర్కారు మీద దాఖలైన కేసుని విచారణ చేపట్టబోతున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఆడుతున్న చోట్ల మాత్రం ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ది కేరళ స్టోరీ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాలు బాగా చూస్తున్నారు. దీని ప్రభావం కన్నడ హిందీలో రిలీజైన విరూపాక్ష డబ్బింగ్ వెర్షన్ మీద పడింది. వీకెండ్స్ లో కొత్త రిలీజులు దేనికీ హౌస్ ఫుల్స్ లేకపోయినా ఒక కేరళ స్టోరీ మాత్రమే సోల్డ్ అవుట్ బోర్డులు పెట్టేసుకుంది
This post was last modified on May 10, 2023 10:54 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…