Movie News

102 సెంట‌ర్ల‌లో 200 రోజులు

శత దినోత్సవం, ర‌జ‌తోత్స‌వం.. ఈ మాటలు వింటే కామెడీగా చూసే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి ఇప్పుడు. ఈ రోజుల్లో. ఏదైనా సినిమా ఒక్క థియేటర్లో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నా.. అది నిజమైన ఘనతగా భావించట్లేదు. పనికట్టుకుని ఆడిస్తే తప్ప మన దగ్గర ఏ సినిమా కూడా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాలు అతి కష్టం మీద కొన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయంతే.

ఇలాంటి టైంలో మన సినిమా ఒకటి వేరే దేశంలో రెండొందలకు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం, వంద‌కు పైగా సెంట‌ర్ల‌లో రెండొంద‌ల రోజులు ఆడ‌టం అన్నది అనూహ్యమైన విషయం. ఈ ఉపోద్ఘాతం అంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది. గ‌త ఏడాది అక్టోబ‌రులో జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్‌ సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసింది రాజ‌మౌళి అండ్ టీం.

అప్ప‌ట్నుంచి ఈ సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్ థియేట్రిక‌ల్ ఎంత‌కీ ముగియ‌ట్లేదు. మూడు నెల‌ల కింద‌ట 200కు పైగా సెంట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ వంద రోజుల ప్ర‌ద‌ర్శ‌న పూర్తి చేసుకుంద‌ని తెలిసి అంద‌రూ షాక‌య్యారు. ఆ త‌ర్వాత కూడా ఆ సినిమా ర‌న్ కొన‌సాగించింది. ఇప్పుడు ఏకంగా 102 సెంట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ జ‌ప‌నీస్ వెర్ష‌న్ 200 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుంది.

ఇండియాలో కూడా ఇప్ప‌టిదాకా ఏ సినిమా ఇన్ని సెంట‌ర్ల‌లో 200 రోజులు ఆడిన చ‌రిత్ర లేదు. దీన్ని బ‌ట్టే ఆర్ఆర్ఆర్ జ‌పాన్‌లో ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవ‌చ్చు. బాహుబ‌లిని మించి అక్క‌డ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఈ సినిమా. వ‌సూళ్లు అక్క‌డ బిలియ‌న్ యాన్‌ల మైలురాయిని ఎప్పుడో దాటేశాయి. 400 మిలియ‌న్ యాన్ల‌తో ఎన్నో ఏళ్ల కింద‌ట ముత్తు సినిమా నెల‌కొల్పిన అత్య‌ధిక వ‌సూళ్ల ఇండియ‌న్ సినిమా రికార్డును ఆర్ఆర్ఆర్ ఎప్పుడో చెరిపేసింది.

This post was last modified on May 10, 2023 7:42 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

26 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago