దసరా తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఒకే ఒక్క సినిమా విరూపాక్ష. హారర్ అంశాలతో రూపొంది ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి కలిగించడంలో దర్శకుడు కార్తీక్ దండు చూపించిన పనితనం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్టు ఇచ్చింది. ఇప్పటిదాకా కలెక్షన్ల పరంగా 84 కోట్లకు పైగా గ్రాస్ 44 కోట్ల దాకా షేర్ వసూలు చేసిన విరూపాక్ష వంద కోట్ల మైలురాయి మీద కన్నేసింది. ఒక్క తెలుగులోనే అంటే కష్టం కనక వచ్చిన యునానిమస్ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకుని గత శుక్రవారం తమిళం, హిందీలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేసింది
ప్రత్యేకంగా దీనికోసం తేజుతో పాటు సంయుక్త మీనన్ తదితరులు నార్త్ తో పాటు చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్లు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. కారణాలు లేకపోలేదు. విరూపాక్షలో కార్తికేయ 2 లాగా దైవత్వానికి సంబంధించిన అంశాలు లేవు. అదే ఉంటే కనెక్టివిటీ పెరిగేది. ఈ దెయ్యాలు చేతబడులు వగైరాలు ఉత్తరాది ఆడియన్స్ కి కొత్త కాదు. రెగ్యులర్ గా ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. సో హిందీ వెర్షన్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదన్నది తేటతెల్లం
ఇక తమిళ సంగతి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలను వాళ్ళు పట్టించుకోవడమే అరుదు. అలాంటిది తేజు లాంటి కొత్త ఫేస్ ని రిసీవ్ చేసుకోవడం అంత సులభంగా ఉండదు. పైగా పొన్నియిన్ సెల్వన్ అప్పటికి రెండో వారంలోనే ఉంది. దాంతో థియేటర్లు సైతం కోరినన్ని దొరకలేదు. ఈ పరిణామాల దృష్ట్యా ఇంకో రెండో రోజుల్లో రిలీజ్ అయ్యే మలయాళంలో ఏదో మేజిక్ చేస్తుందని ఆశించలేం. ఇంకో పదిహేను కోట్లు గ్రాస్ రావడమంటే మాటలు కాదు. ఈ ఫ్రైడే నాగ చైతన్య కస్టడీ ఒకటే ఉంది కాబట్టి దాని టాక్ ని బట్టి వీకెండ్ విరూపాక్షకు ఉపయోగపడుతుందో లేదో చెప్పొచ్చు
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…