మొన్న ‘కస్టడీ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన ప్రసంగం అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘‘సినిమాలో మాస్ వేనుమా మాస్ ఇరుక్కు..’ అంటూ ఆయన ‘వారిసు’ ఆడియో వేడుక సందర్భంగా పాపులర్ అయిన దిల్ రాజు స్పీచ్ తరహాలో.. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ప్రసంగించాడు.
ఒక దర్శకుడు ఇలా ఓ నిర్మాతను అనుకరిస్తూ ఫన్నీగా మాట్లాడ్డం ఆశ్చర్యకరం. ఐతే వెంకట్ ప్రభు శైలి తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఆశ్చర్యంగా అనిపించదు. ‘చెన్నై 28’ నుంచి మొదలుపెడితే.. వెంకట్ ప్రభు సినిమాలన్నీ కూడా ఇలాగే ఫన్నీగా, సెటైరికల్గా ఉంటాయి.
సీరియస్ సినిమాల్లోనూ సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడతాడు. సరోజ, గోవా, మన్కాతా, మాస్, బిరియాని, మానాడు.. ఇలా వెంకట్ ప్రభు కెరీర్లో ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. తన సినిమాలన్నీ ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. మంచి వినోదం పంచుతాయి. అందుకే వెంకట్కు తమిళంలో భారీగా అభిమానగణం ఉంది. తన సినిమాల కోసం ఎంతోమంది ఉత్కంఠగా ఎదురు చూస్తారు. తనతో ఒక్కసారైనా పని చేయాలని స్టార్ హీరోలు కోరుకుంటారు.
అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు.. ‘లవ్ స్టోరీ’ చూసి తన రాసిన ఒక పాత్రకు నాగచైతన్యనే సరిపోతాడని ఏరి కోరి అతణ్ని ఎంచుకోవడం విశేషమే. వీరి కలయికలో వస్తున్న ‘కస్టడీ’ ట్రైలర్ చూస్తే.. వెంకట్ ప్రభు మార్కు థ్రిల్లర్ అనే విషయం అర్థమవుతుంది.
ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ రేకెత్తిస్తూనే ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేకుండా చూసుకుంటాడు వెంకట్ ప్రభు. ప్రధాన పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రోమోల్లో వెంకట్ మార్కు కనిపించింది. సినిమాలో కూడా ఆయన మ్యాజిక్ కొనసాగిస్తే చైతూ ఎప్పట్నుంచో కోరుకుంటున్న మాస్ హిట్ పడి అతడి కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ నెల 12నే ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2023 2:34 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…