కంటెంట్ కన్నా గొప్పదేమీ లేదని అన్ని భాషల సినిమాలు ఋజువు చేస్తున్నాయి. ఎనభై కోట్లు ఖర్చు పెట్టిన యాక్షన్ మూవీకి పది కోట్లు రాకపోతే అందులో సగం కూడా బడ్జెట్ కాని హారర్ థ్రిల్లర్ ఏకంగా నలభై కోట్లు వసూలు చేస్తుంది. బాక్సాఫీస్ విచిత్రాలు ఇలాగే ఉంటాయి. తాజాగా మలయాళంలో మొన్న శుక్రవారం 2018 రిలీజయ్యింది. సంవత్సరాన్నే పేరుగా పెట్టుకుని తీశారు. కేవలం మూడే రోజుల్లో పది కోట్లకు పైగా వసూలు చేసి కేరళలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్ లో థియేటర్ల కొరత వల్ల తక్కువ స్క్రీన్లు ఇస్తే అన్నీ హౌస్ ఫుల్ కావడం గమనార్హం
ఇంతకీ ఈ సినిమాలో ఏముందనేగా మీ డౌట్. అయిదేళ్ల క్రితం కేరళను ఊపేసిన భీభత్సమైన తుఫాను వరదల గురించి మీడియాలో చూశాంగా. దర్శకుడు ఆంటోనీ జోసెఫ్ ఆ నేపధ్యాన్ని తీసుకున్నాడు. అరివిక్కులం అనే పల్లెటూరిలో కథ మొదలవుతుంది. దొంగ సర్టిఫికెట్లతో ఆర్మీ నుంచి బయటికొచ్చిన హీరో(టోవినో థామస్) స్థానికంగా జరిగే గొడవలు రాజకీయాల్లో భాగమవుతాడు. అప్పుడు అకాల వర్షం ముంచెత్తి అందరి ఇళ్ళపైకి నీరు చేరాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పోరాటం చేయడం మొదలుపెడతారు. సముద్రంలో చేపలు పట్టేవాళ్లు, హెలికాఫ్టర్ల సహాయం ఇలా అన్నీ చేర్చారు.
ఆడియన్స్ ని ఇందులో ముఖ్యంగా ఆకట్టుకున్న అంశం కట్టిపడేసే డ్రామా. మీడియం బడ్జెట్ అయినా విజువల్స్ ని తీర్చిదిద్దిన తీరు, సంఘటనల ద్వారా అప్పటి భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన విధానం ఇంకా ఆ విషాదం పచ్చిగానే ఉన్న పబ్లిక్ కి బాగా కనెక్ట్ అయిపోతోంది. ఇలాంటి డిజాస్టర్ బ్యాక్ డ్రాప్ లో మల్లువుడ్ లో గతంలోనూ సినిమాలున్నాయి కానీ మన దగ్గర తక్కువే. ఆ మధ్య శ్రేయ ప్రధాన పాత్రలో హైదరాబాద్ ఫ్లడ్స్ బ్యాక్ డ్రాప్ లో గమనం అనే మూవీ వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ 2018ని తెలుగు డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి
This post was last modified on May 9, 2023 6:34 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…