ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది. అదేవిధంగా అభిమానుల తరపున తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని పేర్కొన్నారు.
సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలిసే ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుక బడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. ఇలా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్లో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. వెనుక బడిన సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచారు. మహిళ యూనివర్శిటీ, హెల్త్ యూనివర్శటీలు తీసుకొచ్చారు. ఎన్నో చారిత్రత్మక పథకాలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికి మా కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు, టీడీపీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నా.. ఎన్టీఆర్కు భారత్న రత్న ఇవ్వాలి అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…