మాస్ మహారాజా రవితేజ జోరు ఇటీవల బాగా తగ్గింది. అతని సినిమాలకు పది కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి వచ్చేసింది. ఈ లాక్డౌన్లో తన కెరీర్ని పునఃసమీక్షించుకునే అవకాశం రవితేజకు దక్కింది. అందుకే ఈ లాక్డౌన్ వేళ తన భవిష్యత్ ప్రణాళికపై రవితేజ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హీరోలంతా తక్కువ సినిమాలు చేస్తూ వుండడం వల్ల మార్కెట్లో వెలితి ఏర్పడుతోంది.
రవితేజ ఆ వాక్యూమ్లో తన స్పేస్ కోసం చూస్తున్నాడని తెలిసింది. క్రాక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో వుంది. షూటింగ్స్ మళ్లీ మొదలయిన తర్వాత క్రాక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తాను చేయబోయే అయిదు చిత్రాలను రవితేజ క్యూలో పెట్టినట్టు తెలిసింది. తన మార్కెట్ డౌన్ అయినా కానీ రవితేజ చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి. అందుకే పారితోషికం పరంగా ఇంత అంటూ నిర్మాతపై భారం వేయకుండా హిందీ రైట్స్ తనకు పారితోషికంగా ఇచ్చేయమని అడుగుతున్నాడట.
రవితేజ పారితోషికం లేకపోతే అతని సినిమాను తక్కువ బడ్జెట్లో తీసేసుకునే వీలుంటుంది కనుక నిర్మాతలు కూడా ఇందుకు సుముఖంగానే వున్నారు. ఓటీటీలకు డిమాండ్ వుంది కనుక రవితేజ చిత్రాలకు ఓటీటీ ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి కనుక థియేట్రికల్ షేర్ పది – పన్నెండు కోట్ల వరకు లెక్క కట్టుకున్నా డీసెంట్ సినిమా తీస్తే మనీ రిటర్న్ గ్యారెంటీ పెరుగుతుంది.
This post was last modified on August 5, 2020 8:59 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…