మాస్ మహారాజా రవితేజ జోరు ఇటీవల బాగా తగ్గింది. అతని సినిమాలకు పది కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి వచ్చేసింది. ఈ లాక్డౌన్లో తన కెరీర్ని పునఃసమీక్షించుకునే అవకాశం రవితేజకు దక్కింది. అందుకే ఈ లాక్డౌన్ వేళ తన భవిష్యత్ ప్రణాళికపై రవితేజ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హీరోలంతా తక్కువ సినిమాలు చేస్తూ వుండడం వల్ల మార్కెట్లో వెలితి ఏర్పడుతోంది.
రవితేజ ఆ వాక్యూమ్లో తన స్పేస్ కోసం చూస్తున్నాడని తెలిసింది. క్రాక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో వుంది. షూటింగ్స్ మళ్లీ మొదలయిన తర్వాత క్రాక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తాను చేయబోయే అయిదు చిత్రాలను రవితేజ క్యూలో పెట్టినట్టు తెలిసింది. తన మార్కెట్ డౌన్ అయినా కానీ రవితేజ చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి. అందుకే పారితోషికం పరంగా ఇంత అంటూ నిర్మాతపై భారం వేయకుండా హిందీ రైట్స్ తనకు పారితోషికంగా ఇచ్చేయమని అడుగుతున్నాడట.
రవితేజ పారితోషికం లేకపోతే అతని సినిమాను తక్కువ బడ్జెట్లో తీసేసుకునే వీలుంటుంది కనుక నిర్మాతలు కూడా ఇందుకు సుముఖంగానే వున్నారు. ఓటీటీలకు డిమాండ్ వుంది కనుక రవితేజ చిత్రాలకు ఓటీటీ ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి కనుక థియేట్రికల్ షేర్ పది – పన్నెండు కోట్ల వరకు లెక్క కట్టుకున్నా డీసెంట్ సినిమా తీస్తే మనీ రిటర్న్ గ్యారెంటీ పెరుగుతుంది.
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…