మాస్ మహారాజా రవితేజ జోరు ఇటీవల బాగా తగ్గింది. అతని సినిమాలకు పది కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి వచ్చేసింది. ఈ లాక్డౌన్లో తన కెరీర్ని పునఃసమీక్షించుకునే అవకాశం రవితేజకు దక్కింది. అందుకే ఈ లాక్డౌన్ వేళ తన భవిష్యత్ ప్రణాళికపై రవితేజ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హీరోలంతా తక్కువ సినిమాలు చేస్తూ వుండడం వల్ల మార్కెట్లో వెలితి ఏర్పడుతోంది.
రవితేజ ఆ వాక్యూమ్లో తన స్పేస్ కోసం చూస్తున్నాడని తెలిసింది. క్రాక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో వుంది. షూటింగ్స్ మళ్లీ మొదలయిన తర్వాత క్రాక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తాను చేయబోయే అయిదు చిత్రాలను రవితేజ క్యూలో పెట్టినట్టు తెలిసింది. తన మార్కెట్ డౌన్ అయినా కానీ రవితేజ చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి. అందుకే పారితోషికం పరంగా ఇంత అంటూ నిర్మాతపై భారం వేయకుండా హిందీ రైట్స్ తనకు పారితోషికంగా ఇచ్చేయమని అడుగుతున్నాడట.
రవితేజ పారితోషికం లేకపోతే అతని సినిమాను తక్కువ బడ్జెట్లో తీసేసుకునే వీలుంటుంది కనుక నిర్మాతలు కూడా ఇందుకు సుముఖంగానే వున్నారు. ఓటీటీలకు డిమాండ్ వుంది కనుక రవితేజ చిత్రాలకు ఓటీటీ ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి కనుక థియేట్రికల్ షేర్ పది – పన్నెండు కోట్ల వరకు లెక్క కట్టుకున్నా డీసెంట్ సినిమా తీస్తే మనీ రిటర్న్ గ్యారెంటీ పెరుగుతుంది.
This post was last modified on August 5, 2020 8:59 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…