స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తుండగానే.. వాళ్ల తర్వాతి సినిమా మీద ఆసక్తికర చర్చలు మొదలైపోతాయి. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోయే నందమూరి బాలకృష్ణ.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోదానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ‘అఖండ’ చేస్తున్నపుడే ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఓకే చేసిన ఆయన.. ఈ చిత్రంలో నటిస్తుండగానే అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ సినిమా షూట్ జోరుగా సాగుతున్న టైంలోనే తర్వాతి సినిమా కోసం చర్చలు నడుస్తున్నాయి. మామూలుగా బాలయ్య పుట్టిన రోజుకు ఆయన అప్పటికే నటిస్తున్న సినిమా తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేయడమే కాక.. కొత్త సినిమాల ప్రకటనలు ఉండేలా చూసుకుంటాడు. గత ఏడాది అనిల్ రావిపూడి సినిమాను జూన్ 10న బాలయ్య పుట్టిన రోజుకే ప్రకటించడం అభిమానులకు గుర్తే.
ఈసారి అనిల్ సినిమా తాలూకు వీడియో గ్లింప్స్తో పాటు టైటిల్ను కూడా వచ్చే నెల పదో తారీఖున రివీల్ చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్య కొత్త సినిమా ప్రకటన కూడా ఆ రోజు ఉంటుందట. ఐతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. బాలయ్య ఏ కథకు ఓటేశారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా చేయాల్సింది. వీరి కలయికలో అఖండ-2 వస్తుందనే ఊహాగానాలు ముందు నుంచి ఉన్నాయి. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ అయ్యాక దానికి సీక్వెల్ ఉంటుందని బాలయ్య , బోయపాటి సంకేతాలు ఇచ్చారు.
ఐతే అనిల్ సినిమా తర్వాత ఈ చిత్రమే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే బోయపాటి ఇంకా కథను సిద్ధం చేయలేదు. రామ్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. దాన్ని పూర్తి చేసి బాలయ్య కోసం స్క్రిప్టు రెడీ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపు బాలయ్య ఇంకో సినిమా చేస్తాడంటున్నారు. ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన పూరి సినిమా ‘కాకా’నే అది అవుతుందా.. లేక బాలయ్య మదిలో ఇంకెవరైనా దర్శకుడు ఉన్నాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on May 8, 2023 3:02 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…