పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాల ప్రియుడు. ప్రతీసారి ఓ కొత్త పుస్తకం గురించి చెబుతూ అభిమానులకు షాక్ ఇస్తుంటాడు పవన్. తాజాగా ‘ఖారవేలుడు’ అనే పుస్తకం, తనలో తొలిసారి రాజకీయాల గురించి ఆలోచన కలిగేలా చేసిందంటూ ట్విట్టర్ ద్వారా వివరించాడు పవన్. ‘మొదటిసారి డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమా ఫెయిల్యూర్తో మానసికంగా కృంగిపోయిన సమయంలో నాగబాబు ఈ పుస్తకం నాకు ఇచ్చాడు…’ అంటూ ఓ పాత పుస్తకాన్ని కొత్తగా పరిచయం చేశాడు జనసేనాని.
ఖాళీ సమయం కనిపిస్తే చాలు, నిత్యం ఏదో పుస్తకం చదువుతూ కనిపించే పవన్ కళ్యాణ్… సొంత పుస్తకం ఎప్పుడూ రాస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓ నిత్య అన్వేషిగా, జనాల కోసం ఏదో చేయాలని పరితపించే ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్కు తెలుగురాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ ఉంది.
బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసే పవర్ స్టార్ సొంతంగా పుస్తకాన్ని రచిస్తే అది సాహితీలోకంలో ఓ సెన్సేషన్ అవుతుంది. రాజకీయాల్లో ఇంకా సక్సెస్ కాకపోయినా, తన స్పీచ్లతో కార్యకర్తలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పదునైన ఆలోచనలకు అక్షర రూపం కల్పిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక.
మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఓ అర్థంకాని ఫజిల్ లాంటిదే. ఆవేశం, ఆలోచన కలగలిసిన పవన్ కళ్యాణ్ తన జీవిత చరిత్రను స్వయంగా రచిస్తే… అది సంచలనం క్రియేట్ చేయడం పక్కా.
ఎన్నో ఎత్తుపల్లాలున్న పవన్ జీవితం పుసక్తరూపంలో వస్తే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికనట్టే. మరి తనలోని సాహిత్య కోణాన్ని బయటికి తీసి పవన్ కళ్యాణ్ పేపర్పై ఎప్పుడు పెడతాడో చూడాలి.
This post was last modified on April 24, 2020 4:24 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…