ఈ మధ్య కాలంలో ట్రైలర్తోనే తీవ్ర వివాదం రేపిన సినిమా అంటే.. ది కేరళ స్టోరీనే. కేరళలో హిందూ, క్రిస్టియన్, ఇతర మతాల అమ్మాయిలను లవ్ జిహాదీ పేరుతో ఇస్లాంలోకి మార్చి వారిని గల్ఫ్ దేశాల్లో అమ్మేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. ఇలాంటి అంశాల చుట్టూ తీవ్ర వివాదాస్పద కథతో తెరకెక్కిన చిత్రమిది.
ఇలాంటి కాంట్రవర్శల్ సినిమాలు థియేటర్లలో రిలీజవడమే కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ ముస్లింలను విలన్లుగా చూపించే ఈ తరహా సినిమాలకు నరేంద్ర మోడీ సర్కారు రాచబాట పరుస్తున్న మాటను ఎవ్వరూ ఖండించలేరు. గత ఏడాది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఇలాగే మద్దతు సంపాదించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇప్పుడు కేరళ స్టోరీ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.
కొవిడ్ తర్వాత హిందీలో మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఐదారు కోట్ల డేవ-1 వసూళ్లకు పరిమితం అవుతున్నాయి. కానీ కేరళ స్టోరీ తొలి రోజు రూ.8 కోట్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. రెండో రోజు వసూళ్లు ఇంకా పెరగడం విశేషం. శనివారం ఈ చిత్రానికి రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇండియాలో.
మేజర్ సిటీస్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. కాగా ఈ సినిమాకు అక్కడక్కడా నిషేధాజ్ఞలు తప్పట్లేదు. తమిళనాడులో మల్టీప్లెక్సులన్నింట్లో ఈ సినిమా షోలు ఆపేశారు ఆదివారం. కేరళలో కూడా చాలా మల్టీప్లెక్సుల్లో సినిమాను ఆడించట్లేదు. అక్కడి ప్రభుత్వమే సినిమాకు వ్యతిరేకంగా ఉంది. భాజపా ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇబ్బందులు తప్పట్లేదు. అయినా సినిమా అందుబాటులో ఉన్న చోట మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…