దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ది కేరళ స్టోరీ నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా ఆడియన్స్ వాళ్లంత వాళ్లే థియేటర్లకు వస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కి చేసిన పబ్లిసిటీలో దీనికి సగం కూడా జరగలేదు. అయినా జనం వెళ్తున్నారు. హైదరాబాద్ లో శని ఆదివారాలు కొత్త రిలీజులు రామబాణం, ఉగ్రం కంటే దీనికే ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. సెన్సార్ ఆలస్యం కావడం వల్ల తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేదు కానీ లేదంటే వసూళ్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండేవని ట్రేడ్ అభిప్రాయ పడుతోంది. కంటెంట్ అంత షాకింగ్ గా ఉంది మరి.
కలెక్షన్ల సంగతి అలా ఉంచితే అసలు ది కేరళ స్టోరీ ఒరిజినల్ కాదనే దానికి ఆధారాలు దొరికాయి. నెట్ ఫ్లిక్స్ లో 2020 సంవత్సరంలో కాలిఫెట్ అనే స్వీడిష్ వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో సుమారు ఏడు గంటల నిడివితో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూ జరుగుతుంది. ఐసిస్ తీవ్రవాదుల ఉచ్చులో పడి ప్రమాదంలో నెట్టబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బ్యాక్ డ్రాప్ యూరోప్ లో ఉంటే మనది కేరళ నుంచి సిరియా అన్నట్టుగా చూపించారు. పోలికలు చాలా ఉన్నాయి.
అసలు దీన్ని చూడకుండా దర్శకుడు సుదిప్తో సేన్ కేరళ స్టోరీని తీశారంటే నమ్మలేనంత సారూప్యతలు ఉన్నాయి. ఇండియాలోనూ ఈ కాలిఫెట్ ని చూడొచ్చు ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. కేరళ తమిళనాడు మల్టీప్లెక్సుల్లో ఇప్పటికీ దీన్ని బ్యాన్ చేశారు.శాంతి భద్రతల సమస్యతో పాటు సరైన స్పందన లేదన్న కారణంగా ప్రదర్శనలు ఆపేశామని సదరు సంఘం పేర్కొంటోంది. లక్కీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకపోవడం విశేషం. సోమవారం బయటికి వచ్చే వసూళ్ల ఫిగర్లు మతిపోయేలా ఉంటాయని బయ్యర్స్ టాక్
This post was last modified on May 7, 2023 9:10 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…