బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన యష్ రాజ్ ఫిలింస్ కి పఠాన్ రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ మాములు కిక్ ఇవ్వలేదు. స్లంప్ లో ఉన్న ఉత్తరాది పరిశ్రమకు ఒక్కసారిగా వెయ్యి కోట్ల సినిమా పడటంతో ఉత్సాహం వచ్చేసింది. దాని తర్వాత ఆ స్థాయిలో ఆడిన మూవీ రాకపోయినా మెల్లగా కుదురుకుంటున్న మాట వాస్తవం. పఠాన్ సక్సెస్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పావు గంట క్యామియో ఎంత కీలక పాత్ర పోషించిందో వేరే చెప్పనక్కర్లేదు. టైగర్ గా భాయ్ జాన్ ఎంట్రీకి థియేటర్లు ఊగిపోయాయి. అందుకే టైగర్ 3 కోసం దీనికి మించిన ఎపిసోడ్ ప్లాన్ చేశారు.
మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కత్రినా కైఫ్ హీరోయిన్ కాగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. షారుఖ్ క్యారెక్టర్ ని పఠాన్ లో చూపించిన దానికన్నా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. కనిపించేది కాసేపే అయినా కేవలం ఆ ఒక్క బ్లాక్ కోసమే అక్షరాలా 35 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మే 8 నుంచి ఈ కాంబో షూట్ జరపబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ తో పాటు గ్రీన్ మ్యాట్ లో ఈ చిత్రీకరణ ఉంటుంది. ఏ సందర్భంలో సల్మాన్, షారుఖ్ లు ఇద్దరూ కలుస్తారనేది ఊహకందని విధంగా ఉంటుందన్నది యూనిట్ నుంచి వస్తున్న ఇన్ సైడ్ టాక్
స్పై సినిమాల మీద ఆదిత్య చోప్రా వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడుతున్నారు. టైగర్ vs పఠాన్ కు ఆల్రెడీ మూడు వందల కోట్ల బడ్జెట్ రెడీ అయ్యింది. దీపికా పదుకునే కత్రినా కైఫ్ కలయికలో హీరోల ప్రమేయం లేకుండా లేడీ స్పై మూవీ తీసేందుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మొత్తంగా చూస్తే నార్త్ ఆడియన్స్ మాకీ గూఢచారి సినిమాలు వద్దు బాబోయ్ అనేదాకా యష్ రాజ్ బ్యానర్ ఆగేలా లేదు. అయినా ఒకటో రెండో అయితే పర్వాలేదు కానీ సంవత్సరాల తరబడి వీటినే తీసుకుంటూ పోతే కొత్త జానర్లు చూసే ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది
This post was last modified on May 7, 2023 9:00 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…