యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ తీరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘ఖుషి’ పోస్టర్లో తన పేరు ముందు ‘The’ అని పెట్టుకోవడాన్ని తప్పుబడుతూ అనసూయ చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది.
విజయ్ అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. బూతులు తిట్టారు. విజయ్ని అనసూయ టార్గెట్ చేయడం ఇది తొలిసారి కాదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అతను పలికిన బూతు మాటల విషయంలో అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిందామె. అప్పుడు కూడా చాలామంది నెటిజన్లతో ఆమెకు వాదోపవాదాలు జరిగాయి.
ఇప్పుడు మరోసారి పనిగట్టుకుని విజయ్ని టార్గెట్ చేసిందంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు తగ్గి లైమ్ లైట్లో లేకుండా పోయిన అనసూయ.. అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తోందన్నది విజయ్ అభిమానులతో పాటు కొందరు నెటిజన్ల ఆరోపణ.
అనసూయ ఉద్దేశం ఏంటన్నది పక్కన పెడితే.. ఇలాంటి వివాదాలు వచ్చినపుడు హీరోలను బాధ్యులుగా చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. గతంలో కత్తి మహేష్ అనే క్రిటిక్కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. కత్తి మహేష్ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ను ఏదో అనడం.. ఆయన్ని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం.. చివరికి కత్తి మహేష్ పవన్నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. తన అభిమానులను పవన్ అదుపులో పెట్టుకోవట్లేదని.. వాళ్లను మందలించట్లేదని మహేష్ ఆరోపించాడు.
తర్వాత ఓ సందర్భంలో పవన్ అభిమానులు తనను తిట్టారంటూ.. పవన్ను పట్టుకుని పోసాని కృష్ణమురళి దారుణమైన బూతులు తిడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు విజయ్ అభిమానుల తీరుతో అనసూయ.. అతణ్ని టార్గెట్ చేస్తోంది. ఐతే విజయ్ తన పేరు ముందు ‘The’ అని పెట్టుకోవడం అతడి వ్యక్తిగత విషయం.. మరి మిగతా హీరోలు తమకు తాముగా పేర్ల ముందు రకరకాల బిరుదులు పెట్టుకున్నారు.. మరి అవేవీ అభ్యంతరకరం కాదా.. వాళ్లందరినీ తప్పుబట్టగలదా అన్న ప్రశ్నలు విజయ్ అభిమానుల నుంచి ఎదురవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఉంటూ ఒక హీరోను అదే పనిగా టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వారంటున్నారు. ఇలా కోరి వివాదాలు తెచ్చుకుని.. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు తిట్టిన తిట్లను స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం.. పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్లడం.. దీనికంతటికీ హీరోదే బాధ్యత అనడం సమంజసమేనా అన్న చర్చ నడుస్తోంది. హీరోలు అభిమానులను నియంత్రించగలరా.. ఒకవేళ వాళ్లు ఊరుకోమని చెప్పినా.. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని ఫ్యాన్స్ వింటారా అన్నది కూడా ఆలోచించాల్సిందే.
ఢిల్లీలో చేపట్టిన నీట్ నిరసనలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు…
సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ ఫార్మ్. ఒక్కసారి థియేటర్లో వచ్చాక దాని మీద అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ప్రతి ఒక్కరికి…
అక్కినేని అఖిల్ కు బలమైన కంబ్యాక్ గా నిలిచిన లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతోంది. అయితే చెన్నై లవ్…
వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయిక మీద ప్రేక్షకుల్లో ఓ రేంజులో హైప్ నెలకొంది. మాటల మాంత్రికుడు రచయితగా…
విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడిన సినిమాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది వాస్తవం. పైగా ఇప్పుడు ఏఐ వచ్చాక జనాలు…