మొన్న రాజమౌళి చెప్పాడు.. ఇప్పుడు అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఓపెన్ అయ్యారు. ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది. వీళ్లంతా కూడా కామన్గా చేసిన హెచ్చరిక.. చిన్న సినిమాలకు గడ్డు కాలం తప్పదనే. తక్కువ పెట్టుబడితో కష్టపడి ఏదోలా సినిమాను ముగించి.. బిజినెస్ చేసుకుని రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటే.. లాక్ డౌన్ వచ్చి పడి సినిమాలు ల్యాబుల్లోనే మగ్గాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది.
నెలో రెండు నెలలో అయితే తట్టుకుని నిలబడొచ్చు కానీ.. ఆరేడు నెలలంటే చాలా కష్టమైపోతుంది. వడ్డీల భారం పెరిగితే పెట్టుబడి రెట్టింపవుతుంది. థియేటర్లు తెరుచుకున్నాక కూడా కొన్ని నెలల పాటు ఆశించిన రెవెన్యూ ఉండే అవకాశం లేదు. ఇంతకుముందే చిన్న సినిమాలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టంగా ఉంది. మెయింటైనెన్స్కు తగ్గ రాబడి కూడా రావట్లేదు.
అలాంటిది పోస్ట్ కరోనా రిలీజ్ అంటే పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. అందుకే చిన్న సినిమాలకు దిల్ రాజు, అరవింద్ లాంటి వాళ్లు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వడ్డీల భారాన్ని తట్టుకుని అన్ని సినిమాలూ నిలబడలేవన్నారు. ఓటీటీల్లో డైరెక్ట్గా రిలీజ్ చేసే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చూస్తుంటే పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో కానీ.. చిన్న సినిమాలైతే థియేట్రికల్ రిలీజ్ మీద ఆశలు పెట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది.
కష్టమో నష్టమో ఓటీటీల్లో రిలీజ్ చేసేసుకోవడమే బెటర్ అంటున్నారు. ఓటీటీల్లో రిలీజ్ కోసం ప్రచారం గట్టిగా చేసి అక్కడ రెస్పాన్స్ బాగుంటే.. శాటిలైట్ డీల్ కూడా చేసుకోవడానికి అవకాశముంది. కాబట్టి చిన్న సినిమాల నిర్మాతలు ఇంకొన్ని రోజులు పరిస్థితులు చూశాక కొంచెం గుండె దిటవు చేసుకుని ఓటీటీల్లో డైరెక్ట్ సినిమాల్ని రిలీజ్ చేయక తప్పని పరిస్థితి తలెత్తవచ్చంటున్నారు.
This post was last modified on April 24, 2020 4:27 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…