దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్ వాస్తవానికి ఈ మేలోనే విడుదల కావాలి. ఆ మేరకు ఇంతకు ముందే ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడంతో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఆలస్యం జరగడంతో వాయిదా వేయక తప్పలేదు. సరైన సమయంలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని నిన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి దీని మీద చిన్న టీజర్, ఒక లిరికల్ వీడియోతోనే మంచి బజ్ వచ్చింది. నార్త్ వైపు నుంచి ట్రేడ్ పరంగా పెద్ద ఆఫర్లే వచ్చాయి. అయినా ఎందుకు ఆగారనే దానికి ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఆది పురుష్ మీద సమాన స్థాయిలో అంచనాలు అనుమానాలు రెండూ ఉన్నాయి. కొంత క్లారిటీ మే 9న వచ్చే ట్రైలర్ తో ఇచ్చేస్తారు కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న గాథ. ఎలాంటి కల్పితాలు ఉండవు. దాదాపు ఉన్నదున్నట్టుగానే తెరకెక్కించారు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ప్రమోషన్లను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రేంజ్ లో విడుదల ప్లాన్ చేసుకుంది. ది కేరళ స్టోరీని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు. అలాంటిది అయోధ్య ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆది పురుష్ ని ఇంకో స్థాయిలో పొగుడుతారు
ఇలా ఇంకో రెండు మూడు వారాల్లో ఆది పురుష్ హంగామా పీక్స్ కు వెళ్లిపోతుంది. ఈ సందడిలో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హనుమాన్ గురించి ఏం చెప్పినా జనానికి రిజిస్టర్ అవ్వదు. పైగా హీరో తేజ సజ్జకు తెలుగులోనే కాస్త ఇమేజ్ ఉంది. బయట గుర్తుపట్టరు. అలాంటప్పుడు పబ్లిసిటీ పాత్ర చాలా కీలకం. అందరూ రాముడి మీదే దృష్టి పెట్టినప్పుడు హనుమంతుడిని పట్టించుకోవడం తక్కువ. అందుకే జూలైలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈలోగా అది పురుష్ కు పబ్లిక్ లో వచ్చిన స్పందన, కలెక్షన్లు అయోధ్య సెంటిమెంట్ ఇవన్నీ హనుమాన్ కు ఉపయోగపడతాయి.
This post was last modified on May 7, 2023 6:58 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…