దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్ వాస్తవానికి ఈ మేలోనే విడుదల కావాలి. ఆ మేరకు ఇంతకు ముందే ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడంతో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఆలస్యం జరగడంతో వాయిదా వేయక తప్పలేదు. సరైన సమయంలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని నిన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి దీని మీద చిన్న టీజర్, ఒక లిరికల్ వీడియోతోనే మంచి బజ్ వచ్చింది. నార్త్ వైపు నుంచి ట్రేడ్ పరంగా పెద్ద ఆఫర్లే వచ్చాయి. అయినా ఎందుకు ఆగారనే దానికి ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఆది పురుష్ మీద సమాన స్థాయిలో అంచనాలు అనుమానాలు రెండూ ఉన్నాయి. కొంత క్లారిటీ మే 9న వచ్చే ట్రైలర్ తో ఇచ్చేస్తారు కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న గాథ. ఎలాంటి కల్పితాలు ఉండవు. దాదాపు ఉన్నదున్నట్టుగానే తెరకెక్కించారు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ప్రమోషన్లను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రేంజ్ లో విడుదల ప్లాన్ చేసుకుంది. ది కేరళ స్టోరీని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు. అలాంటిది అయోధ్య ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆది పురుష్ ని ఇంకో స్థాయిలో పొగుడుతారు
ఇలా ఇంకో రెండు మూడు వారాల్లో ఆది పురుష్ హంగామా పీక్స్ కు వెళ్లిపోతుంది. ఈ సందడిలో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హనుమాన్ గురించి ఏం చెప్పినా జనానికి రిజిస్టర్ అవ్వదు. పైగా హీరో తేజ సజ్జకు తెలుగులోనే కాస్త ఇమేజ్ ఉంది. బయట గుర్తుపట్టరు. అలాంటప్పుడు పబ్లిసిటీ పాత్ర చాలా కీలకం. అందరూ రాముడి మీదే దృష్టి పెట్టినప్పుడు హనుమంతుడిని పట్టించుకోవడం తక్కువ. అందుకే జూలైలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈలోగా అది పురుష్ కు పబ్లిక్ లో వచ్చిన స్పందన, కలెక్షన్లు అయోధ్య సెంటిమెంట్ ఇవన్నీ హనుమాన్ కు ఉపయోగపడతాయి.
This post was last modified on May 7, 2023 6:58 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…