దూరంగా ఉన్నా దొరికిపోయిన దర్శకుడు

మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు దర్శకుడు పరశురామ్ జాతకం మారిపోయిందనే అనుకున్నారందరూ. కానీ సర్కారు వారి పాట కమర్షియల్ గా బాగానే పే చేసినా సూపర్ స్టార్ రేంజ్ అనిపించుకోవడం కానీ, తన బెస్ట్ గా నిలిచిపోవడం కానీ జరగలేదు. పైగా కంటెంట్ పరంగా చాలా విమర్శలే వచ్చాయి. సరే డిజాస్టర్ పడలేదనే సంతోషం అభిమానులకు మిగిలింది. అప్పటి నుంచి పరశురామ్ బయట కనిపించలేదు. మీడియాకు దొరకలేదు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మిత్రుల వేడుకల్లో కనిపిస్తాడేమోనని చూస్తే పెద్దగా ప్రయోజనం లేదు. 

ఆ మధ్య దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించే దాకా తన పేరు మళ్ళీ వినిపించలేదు. అది కూడా వివాదం జరిగింది. తనకు మాట ఇచ్చి తప్పాడనే కోపంతో అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా నిలదీద్దామని  సమాచారం ఇచ్చి దాన్ని ఆపేసిన సంగతి అందరికీ గుర్తే. లోలోపల సర్దిచెప్పడంతో గీతా ఆర్ట్స్ అధినేత చల్లబడ్డారు. అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని హఠాత్తుగా ప్రాజెక్టులు మారిపోతాడని పరశురామ్ మీదున్న అభియోగం. తానుగా దీని మీద బయట పడలేదు కానీ తాజాగా నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

అసలు పరశురామ్ గురించి మాట్లాడ్డమే వృథా అన్నట్టు చైతు అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పేరున్న దర్శకుడు ఇలా బహిరంగ విమర్శకు గురవ్వడం ఈ మధ్యకాలంలో లేదు. దీంతో అటు మహేష్ ఇటు చైతు ఫ్యాన్స్ ఇద్దరూ మీమ్స్, ట్వీట్లు, కొటేషన్లతో అతన్ని కార్నర్ చేయడం మొదలుపెట్టారు. సమాధానం చెప్పేందుకు అందుబాటులో లేకపోయినా ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే చైతు ఇంత అసహనంగా అన్నాడంటే కథ అంటూ స్క్రిప్ట్ అంటూ ఎంత టైం వృథా చేశాడో అర్థమవుతుందని విరుచుకుపడుతున్నారు. దూరంగా ఉన్న దొరికిపోవడమంటే ఇదే

This post was last modified on May 7, 2023 6:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

1 hour ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

3 hours ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

3 hours ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

4 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

4 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

5 hours ago