దూరంగా ఉన్నా దొరికిపోయిన దర్శకుడు

మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు దర్శకుడు పరశురామ్ జాతకం మారిపోయిందనే అనుకున్నారందరూ. కానీ సర్కారు వారి పాట కమర్షియల్ గా బాగానే పే చేసినా సూపర్ స్టార్ రేంజ్ అనిపించుకోవడం కానీ, తన బెస్ట్ గా నిలిచిపోవడం కానీ జరగలేదు. పైగా కంటెంట్ పరంగా చాలా విమర్శలే వచ్చాయి. సరే డిజాస్టర్ పడలేదనే సంతోషం అభిమానులకు మిగిలింది. అప్పటి నుంచి పరశురామ్ బయట కనిపించలేదు. మీడియాకు దొరకలేదు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మిత్రుల వేడుకల్లో కనిపిస్తాడేమోనని చూస్తే పెద్దగా ప్రయోజనం లేదు. 

ఆ మధ్య దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించే దాకా తన పేరు మళ్ళీ వినిపించలేదు. అది కూడా వివాదం జరిగింది. తనకు మాట ఇచ్చి తప్పాడనే కోపంతో అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా నిలదీద్దామని  సమాచారం ఇచ్చి దాన్ని ఆపేసిన సంగతి అందరికీ గుర్తే. లోలోపల సర్దిచెప్పడంతో గీతా ఆర్ట్స్ అధినేత చల్లబడ్డారు. అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని హఠాత్తుగా ప్రాజెక్టులు మారిపోతాడని పరశురామ్ మీదున్న అభియోగం. తానుగా దీని మీద బయట పడలేదు కానీ తాజాగా నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

అసలు పరశురామ్ గురించి మాట్లాడ్డమే వృథా అన్నట్టు చైతు అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పేరున్న దర్శకుడు ఇలా బహిరంగ విమర్శకు గురవ్వడం ఈ మధ్యకాలంలో లేదు. దీంతో అటు మహేష్ ఇటు చైతు ఫ్యాన్స్ ఇద్దరూ మీమ్స్, ట్వీట్లు, కొటేషన్లతో అతన్ని కార్నర్ చేయడం మొదలుపెట్టారు. సమాధానం చెప్పేందుకు అందుబాటులో లేకపోయినా ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే చైతు ఇంత అసహనంగా అన్నాడంటే కథ అంటూ స్క్రిప్ట్ అంటూ ఎంత టైం వృథా చేశాడో అర్థమవుతుందని విరుచుకుపడుతున్నారు. దూరంగా ఉన్న దొరికిపోవడమంటే ఇదే

This post was last modified on May 7, 2023 6:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago