ఆరేళ్ళ క్రితం స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ తెలుగుని లాంచ్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాన్ని నడిపించిన తీరు మంచి స్పందన తీసుకొచ్చింది. సినిమాల వల్ల తర్వాతి సీజన్లు వదిలేయాల్సి వచ్చింది కానీ ఇప్పటికీ ఈ షో ఫ్యాన్స్ తారక్ యాంకరింగ్ ని ఇష్టపడతారు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఎవరు మీలో కోటీశ్వరులుని హోస్ట్ చేయడం దాని పాపులారిటీని ఇంకా పెంచింది. యంగ్ టైగర్ కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడంతో జెమిని నెట్ వర్క్ వేరే స్టార్ తో సెకండ్ సీజన్ ని చేయడం ఇష్టం లేక వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పట్లో ఉండకపోవచ్చు.
ఇదిలా ఉండగా ఈటీవీ సైతం తారక్ తో ఓ మెగా టాక్ షో లాంటి ప్రోగ్రాంని డిజైన్ చేసే పనిలో ఉందని వినికిడి. శాటిలైట్ ఛానల్స్ రంగంలో పాతికేళ్ల క్రితం సరికొత్త విప్లవానికి తెరతీసిన ఈటీవీ ఇటీవలే ఓటిటిలోనూ అడుగు పెట్టింది. విన్ పేరుతో లాంచ్ చేసిన యాప్ కి సబ్స్క్రిప్షన్ రేట్లు పెట్టి థియేటర్ రిలీజ్ కాని స్ట్రెయిట్ సినిమాలను డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం కొంటోంది. అందులో భాగంగానే రవిబాబు అసలు లాంటివి నేరుగా అందులోనే వచ్చాయి. ఇప్పుడీ పాపులారిటీని మరింత పెంచడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు టాక్.
తారక్ కు ఈనాడుతో మంచి అనుబంధం ఉంది. తన డెబ్యూ మూవీ నిన్ను చూడాలని తీసింది ఉషాకిరణ్ సంస్థే. ఆ బ్యానర్ కున్న మార్కెటింగ్ నెట్వర్క్ వల్ల యావరేజ్ కంటెంట్ ఉన్న ఆ సినిమా జనంలోకి బాగానే వెళ్ళింది. అందుకే ఒకవేళ నిజంగా ఈ ప్రపోజల్ కార్యరూపం దాలిస్తే ఈటీవీకి ఓ అస్త్రం దొరికినట్టు అవుతుంది. అయితే జూనియర్ విపరీతమైన బిజీలో ఉన్నాడు. ముందు కొరటాల శివది పూర్తి చేయాలి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు తాలూకు పనులు అక్టోబర్ నుంచి మొదలుపెట్టాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంత టైట్ షెడ్యూల్స్ మధ్య బుల్లితెర రీ ఎంట్రీ ఇవ్వడం సులభం కాదు
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…