పేరుకి టీవీ యాంకరే కానీ అనసూయకున్న ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు. జబర్దస్త్ నుంచి రంగస్థలం దాకా టీవీ సినిమా రెండిట్లోనూ వరస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లతో కయ్యం పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఆన్ లైన్ గొడవలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల వరకు వెళ్లాయి. వీటి సంగతలా ఉంచితే నిన్న అనసూయ మరోసారి ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేయడం ఫ్యాన్ లో దుమారం రేపుతోంది. హీరో పేరు ప్రస్తావించకపోయినా ఎవరి గురించో అర్థమయ్యేలాగే కౌంటర్ వేసింది.
నిన్న విడుదలైన ఖుషి లిరికల్ సాంగ్ అప్ డేట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది(THE) అని ఉంది. మాములుగా అత్యున్నత వ్యక్తులకు గౌరవం ఇచ్చే క్రమంలో దీన్ని వాడతారు. ది ప్రెసిడెంట్, ది చీఫ్ మిస్టర్ టైపులో. అలా అని సామాన్యులు, సెలబ్రిటీలు పెట్టుకోవడం చట్టవ్యతిరేకం కాదు. బహుశా మైత్రి టీమ్ లేదా రౌడీ హీరో ఈ కోణంలో అలోచించి పెట్టుకుని ఉంటారు. ఇందులో తీవ్రంగా తప్పుబట్టాల్సింది ఏమి లేదు. అయితే ఆ ది పదాన్ని ఆక్షేపించిన అనసూయ ఆ పైత్యం తనకూ అంటుకోకపోతే మంచిదని అయ్యబాబోయ్ అని ట్వీట్ పెట్టి వదిలేసింది
ఇది కాస్తా వైరల్ కావడంతో దేవరకొండ ఫ్యాన్స్ కౌంటర్స్ మొదలుపెట్టారు. కొందరు సూటిగా కొందరు అసభ్యంగా కామెంట్లు పెట్టారు. ట్విట్టర్ అంటేనే ముప్పాతిక ఫేక్ ఐడిల ప్రపంచం కాబట్టి ఇదంతా టైం వేస్ట్ యవ్వారం. అయినా సరే అనసూయ తగ్గకుండా వాళ్లకు చురకలు వేస్తూనే ఉంది. ఇప్పుడే కాదు అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అన్న మాట దగ్గరి నుంచి అనసూయ ఏదో ఒక రూపంలో ఇలా టార్గెట్ చేస్తూనే ఉందని అభిమానుల వెర్షన్. ఏది ఎలా ఉన్నా చక్కగా మూడు సినిమాలు ఆరు షోలు చేసుకుని వెలిగిపోతున్న టైంలో ఈ రాద్ధాంతం ఎందుకనే వాళ్ళు లేకపోలేదు
This post was last modified on May 6, 2023 6:51 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…