Adipurush
ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ విషయంలో అభిమానులు ఎంత కంగారు పడ్డారో తెలిసిందే. చిత్ర బృందం కూడా ఒక దశలో ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని తెగ కంగారు పడిపోయింది. ‘ఆదిపురుష్’ టీజర్కు వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి. ఐతే ఆ నెగెటివిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.
వీఎఫెక్స్ కరెక్షన్ల తర్వాత సినిమా మెరుగ్గా తయారైందని అంటున్నారు. అంతే కాక త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ విషయంలో కూడా బాలీవుడ్ అంతర్గత వర్గాల టాక్ బాగుంది. ఇక ప్రమోషన్ల విషయంలోనూ చిత్ర బృందం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోవడం అన్నింటకంటే కలిసి వచ్చే అంశం కానుంది.
జూన్ నెల 16న ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుండగా.. అంతకు రెండు వారాల ముందే షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ రిలీజ్ కావాల్సింది. జూన్ 2న రిలీజ్కు చాన్నాళ్ల ముందే డేట్ ఇచ్చారు. అట్లీ లాంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్ తీసిన సినిమా కావడం.. ‘పఠాన్’ తర్వాత షారుఖ్ చేసిన చిత్రం కావడంతో ‘జవాన్’కు మంచి హైపే ఉంది. ‘జవాన్’కు మంచి టాక్ వస్తే కొన్ని వారాల పాటు బాక్సాఫీస్లో డామినేట్ చేసే అవకాశముంది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి వీఎఫెక్స్, ఇతర వర్క్స్ పెండింగ్ ఉండటంతో జూన్ 2 డెడ్ లైన్ను అందుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో సినిమాను వాయిదా వేసేశారు. ఆల్రెడీ వేసవిలో సరైన సినిమాలు పడక బాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. సౌత్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ లాంటి టాప్ స్టార్ నటించిన భారీ చిత్రం జూన్లో రిలీజైతే అందరి దృష్టీ దాని మీదికి మళ్లుతుంది. పాజిటివ్ టాక్ వస్తే రికార్డు మోత మోగడం ఖాయం.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…