Adipurush
ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ విషయంలో అభిమానులు ఎంత కంగారు పడ్డారో తెలిసిందే. చిత్ర బృందం కూడా ఒక దశలో ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని తెగ కంగారు పడిపోయింది. ‘ఆదిపురుష్’ టీజర్కు వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి. ఐతే ఆ నెగెటివిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.
వీఎఫెక్స్ కరెక్షన్ల తర్వాత సినిమా మెరుగ్గా తయారైందని అంటున్నారు. అంతే కాక త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ విషయంలో కూడా బాలీవుడ్ అంతర్గత వర్గాల టాక్ బాగుంది. ఇక ప్రమోషన్ల విషయంలోనూ చిత్ర బృందం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోవడం అన్నింటకంటే కలిసి వచ్చే అంశం కానుంది.
జూన్ నెల 16న ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుండగా.. అంతకు రెండు వారాల ముందే షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ రిలీజ్ కావాల్సింది. జూన్ 2న రిలీజ్కు చాన్నాళ్ల ముందే డేట్ ఇచ్చారు. అట్లీ లాంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్ తీసిన సినిమా కావడం.. ‘పఠాన్’ తర్వాత షారుఖ్ చేసిన చిత్రం కావడంతో ‘జవాన్’కు మంచి హైపే ఉంది. ‘జవాన్’కు మంచి టాక్ వస్తే కొన్ని వారాల పాటు బాక్సాఫీస్లో డామినేట్ చేసే అవకాశముంది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి వీఎఫెక్స్, ఇతర వర్క్స్ పెండింగ్ ఉండటంతో జూన్ 2 డెడ్ లైన్ను అందుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో సినిమాను వాయిదా వేసేశారు. ఆల్రెడీ వేసవిలో సరైన సినిమాలు పడక బాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. సౌత్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ లాంటి టాప్ స్టార్ నటించిన భారీ చిత్రం జూన్లో రిలీజైతే అందరి దృష్టీ దాని మీదికి మళ్లుతుంది. పాజిటివ్ టాక్ వస్తే రికార్డు మోత మోగడం ఖాయం.
This post was last modified on May 6, 2023 10:38 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…