బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో ముంబై పోలీసుల విచారణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో, తాజాగా, సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు, సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రియా చక్రవర్తి అభ్యర్థనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రియాకు రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీం, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థననూ తిరస్కరించింది.
సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి చుట్టూ రోజుకో ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రియాను ముంబై పోలీసులు 11 గంటలపాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని, తనకు ప్రొటెక్షన్ కల్పించాలని సుప్రీంను రియా ఆశ్రయించారు. ఆ రెండు అభ్యర్థనలను సుప్రీం తిరస్కరించడంతో రియాకు చుక్కెదురైంది.
దీంతోపాటు,ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి 3 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం వాయిదా వేసింది. తాజాగా సుప్రీం ఆదేశాలతో ఏ క్షణంలోనైనా రియాను బీహార్ పోలీసులు ప్రశ్నించే అవకాశముంది.
This post was last modified on August 5, 2020 8:42 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…