బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో ముంబై పోలీసుల విచారణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో, తాజాగా, సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు, సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రియా చక్రవర్తి అభ్యర్థనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రియాకు రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీం, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థననూ తిరస్కరించింది.
సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి చుట్టూ రోజుకో ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రియాను ముంబై పోలీసులు 11 గంటలపాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని, తనకు ప్రొటెక్షన్ కల్పించాలని సుప్రీంను రియా ఆశ్రయించారు. ఆ రెండు అభ్యర్థనలను సుప్రీం తిరస్కరించడంతో రియాకు చుక్కెదురైంది.
దీంతోపాటు,ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి 3 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం వాయిదా వేసింది. తాజాగా సుప్రీం ఆదేశాలతో ఏ క్షణంలోనైనా రియాను బీహార్ పోలీసులు ప్రశ్నించే అవకాశముంది.
This post was last modified on August 5, 2020 8:42 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…