ఒకప్పుడు సౌత్ సినిమాలంటే ఓ రకమైన చులకన భావంతో చూసేవాళ్లు బాలీవుడ్ భామలు. ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ సెటిలైన తర్వాత కూడా ఇలాంటి ‘ఛీప్’ కామెంట్స్ చేసిన ముద్దుగుమ్మలూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘బాహుబలి’ సినిమాతో యావత్ భారతానికి టాలీవుడ్ స్టామినా ఏంటో తెలిసింది. దాంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగులో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓ టాలెంటెడ్, గ్లామరస్ హీరోయిన్, తెలుగులో నటించాలని ఉందంటూ ప్రకటించింది.
మొదటి సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్. ‘దమ్ లాగ కే హైసా’ మూవీలో భారీ కాయం ఉన్న గృహిణిగా భూమీ నటనకు ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ స్లిమ్ లుక్లోకి వచ్చిన భూమీ… విలక్షణమైన సినిమాలనే ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ సీన్స్లో నటించడానికి కూడా ఏ మాత్రం మొహమాటపడని భూమీ… తన నటనతో హీరోలనే డామినేట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్ సినిమాల్లో నటించకూడదని ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వస్తే, తెలుగు సినిమాల్లో నటించాలనే ఆశగా ఉంది’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భూమీ. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్న భూమీ పెడ్నేకర్… టాలీవుడ్ స్టార్ హీరోలకు ఓ మంచి ఆప్షన్ అవుతుంది.
అయితే ఇంతకుముందు ఇలాగే… అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమని ప్రకటించిన బాలీవుడ్ భామలు, తీరా ఛాన్సిచ్చాక భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు. దాంతో తెలుగు నిర్మాతలు వెనక్కి రావాల్సి వచ్చింది. అదీగాక బాలీవుడ్లో భూమీ నటించిన ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’, ‘శుభ్ మంగల్ సావ్ధాన్’, ‘బాలా’, వంటి సినిమాలు బ్లాక్బస్టర్ అయ్యాయి. మరి ఈ గోల్డెన్ లెగ్ తెలుగులో నటించేందుకు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందోనని భయపడుతున్నారు తెలుగు నిర్మాతలు. ఈ ‘లస్ట్ స్టోరీస్’ పాప కోరినంత ఇచ్చి, టాలీవుడ్కి తీసుకొచ్చే నిర్మాత ఎవ్వరో చూడాలి.
This post was last modified on April 24, 2020 4:25 am
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…