ఒకప్పుడు సౌత్ సినిమాలంటే ఓ రకమైన చులకన భావంతో చూసేవాళ్లు బాలీవుడ్ భామలు. ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ సెటిలైన తర్వాత కూడా ఇలాంటి ‘ఛీప్’ కామెంట్స్ చేసిన ముద్దుగుమ్మలూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘బాహుబలి’ సినిమాతో యావత్ భారతానికి టాలీవుడ్ స్టామినా ఏంటో తెలిసింది. దాంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగులో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓ టాలెంటెడ్, గ్లామరస్ హీరోయిన్, తెలుగులో నటించాలని ఉందంటూ ప్రకటించింది.
మొదటి సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్. ‘దమ్ లాగ కే హైసా’ మూవీలో భారీ కాయం ఉన్న గృహిణిగా భూమీ నటనకు ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ స్లిమ్ లుక్లోకి వచ్చిన భూమీ… విలక్షణమైన సినిమాలనే ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ సీన్స్లో నటించడానికి కూడా ఏ మాత్రం మొహమాటపడని భూమీ… తన నటనతో హీరోలనే డామినేట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్ సినిమాల్లో నటించకూడదని ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వస్తే, తెలుగు సినిమాల్లో నటించాలనే ఆశగా ఉంది’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భూమీ. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్న భూమీ పెడ్నేకర్… టాలీవుడ్ స్టార్ హీరోలకు ఓ మంచి ఆప్షన్ అవుతుంది.
అయితే ఇంతకుముందు ఇలాగే… అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమని ప్రకటించిన బాలీవుడ్ భామలు, తీరా ఛాన్సిచ్చాక భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు. దాంతో తెలుగు నిర్మాతలు వెనక్కి రావాల్సి వచ్చింది. అదీగాక బాలీవుడ్లో భూమీ నటించిన ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’, ‘శుభ్ మంగల్ సావ్ధాన్’, ‘బాలా’, వంటి సినిమాలు బ్లాక్బస్టర్ అయ్యాయి. మరి ఈ గోల్డెన్ లెగ్ తెలుగులో నటించేందుకు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందోనని భయపడుతున్నారు తెలుగు నిర్మాతలు. ఈ ‘లస్ట్ స్టోరీస్’ పాప కోరినంత ఇచ్చి, టాలీవుడ్కి తీసుకొచ్చే నిర్మాత ఎవ్వరో చూడాలి.
This post was last modified on April 24, 2020 4:25 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…