ఈ నెలలో చెప్పుకోదగ్గ అంచనాలతో విడుదలవుతున్న సినిమాల్లో కస్టడీనే ముందు వరసలో ఉంది. ఏజెంట్ తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోతాయనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన ఈ కాప్ థ్రిల్లర్ లో అరవింద్ స్వామి విలన్ గా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్. ఒక తెలుగు మూవీకి ఇళయరాజా యువన్ శంకర్ రాజా కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. మే 12న రిలీజ్ కాబోతున్న కస్టడీ మీద హైప్ పెంచే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. అదీ వచ్చేసింది
శివ(నాగచైతన్య) చిన్న కానిస్టేబుల్. డ్యూటీలో ఎంత సిన్సియర్ అంటే ఏదైనా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే సిఎం కాన్వాయ్ ఆపి మరీ చెప్పేంత. అలాంటి యువకుడికి అతి పెద్ద సవాల్ ఎదురవుతుంది. ప్రభుత్వ వ్యవస్థ కంటికి రెప్పలా కాపాడుతున్న కరుడు గట్టిన దుర్మార్గుడి(అరవింద్ స్వామి)ని జైలు నుంచి తప్పించి ఒక చోటికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ప్రియురాలు(కృతి శెట్టి)వారిస్తున్నా రిస్క్ కు సిద్ధపడతాడు. దీని వల్ల స్వంత డిపార్ట్ మెంట్ కే శత్రువుగా మారతాడు. ఏకంగా ప్రాణాల మీదకు వస్తుంది. అసలిదంతా శివ ఎందుకు చేశారు.
వీడియో మొత్తం మంచి ఇంటెన్సిటీతో సాగింది. విజువల్స్ లో ఎక్కడా రొటీన్ కమర్షియల్ సినిమా అనే భావన కలగకుండా వెంకట్ ప్రభు తనదైన మేకింగ్ స్టైల్ తో నింపేశారు. శరత్ కుమార్, ప్రియమణి లాంటి ఇతర సీనియర్ ఆర్టిస్టులతో ఒక హై వోల్టేజ్ డ్రామా చూడబోతున్న ఫీలింగ్ అయితే కలిగించారు. నేపధ్య సంగీతం యువన్ శైలిలో సాగగా చైతు స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంది. నటన పరంగా కొత్త ఛాలెంజ్ నే స్వీకరించాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రాబోతున్న కస్టడీ కు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే బొమ్మ హిట్టే
This post was last modified on May 6, 2023 8:51 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…