Movie News

సీబీఐకి సుశాంత్ కేసు.. ఆమెకిక సంకెళ్లేనా?

రెండు నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మద్దతుదారులు కోరుకున్న పరిణామం బుధవారం చోటు చేసుకుంది. అతడి మృతి కేసును సీబీఐ టేకప్ చేయబోతోంది.

సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటుబాలీవుడ్ బడా బాబులకు ఈ కేసుతో సంబంధం ఉందని.. కానీ ముంబయి పోలీసులు ఈ కేసు తీవ్రత తగ్గించేలా, వాళ్లెవ్వరికీ ఇబ్బంది రాకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎంక్వైరీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.

ఎట్టకేలకు సుశాంత్ మద్దతుదారులు కోరుకున్నదే జరిగింది. ఈ కేసు సీబీఐ చేతికే వెళ్లనుంది. కాగా.. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్టు కచ్చితంగా జరుగుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

సుశాంత్ మృతి వెనుక కచ్చితంగా రియా ఉందని.. అతను బలవన్మరణానికి పాల్పడటానికి కారణం ఆమేనని పెద్ద ఎత్తునే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ తండ్రి సైతం ఆమెపై ఆరోపణలు చేశాడు. గత రెండు నెలల్లో సుశాంత్ అకౌంట్ నుంచి రియా రూ.3 కోట్ల దాకా వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే కొన్ని రోజుల కిందట ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌ను అనుమానాస్పద రీతిలో రియా ఖాళీ చేసి వెళ్లిపోవడం సందేహాలు రేకెత్తించింది.

సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ సైతం రియా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆమెతో గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చాక సుశాంత్ నీరుగారిపోయాడని.. ఆమె అనేక రకాలుగా సుశాంత్‌ను ఇబ్బంది పెట్టిందని అన్నాడు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈ కేసును టేకప్ చేయగానే రియాను అదుపులోకి తీసుకుంటారని.. అరెస్టు ఖాయమని అంటున్నారు.

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

15 minutes ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

33 minutes ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

58 minutes ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

2 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

2 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

3 hours ago