తెలుగు సినీరంగంలో ధ్రువతారగా వెలుగొంది, రాజకీయంలో తిరుగులేని నాయకుడుగా, అశేష ప్రజల మనస్సుల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ డా. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నందు మే 20 తారీఖున ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగబోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం 2018 నుంచి ప్రతి సంవత్సరం తారకరాముని జన్మదిన వేడుకలను జర్మనీ లో నివసిస్తున్న తెలుగువారితో మినీ మహానాడు గా ఘనంగా జరుపుకుంటారు.
ఈసారి కూడా శతజయంతి ని మునిపెన్నడూ లేని విధంగా జరపాలి అని తెలుగుదేశం జర్మనీ విభాగపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.
రాబోయే సంవత్సరంలో ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీకి తమవంతు సహాయంగా ఎలా ఉపయోగపడాలో తీర్మానాల ద్వారా చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయి తమ సందేశాలను పంచుకుంటారు అని కమిటీ సభ్యులు తెలిపారు.
జర్మనీలో నివసిస్తున్న ప్రతి తెలుగువాడు మినీ మహానాడుకి హాజరయి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించవలసినదిగా కోరారు.
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on May 5, 2023 7:31 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…