ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలే నడుపుతాయని.. అది చాలా పెద్ద వ్యవహారం అని.. పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుందని.. ఓటీటీ మొదలుపెట్టినా దాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ ఆలోచన తప్పు అని రుజువు చేశాడు అల్లు అరవింద్.
ఓ నిర్మాతగా తన దగ్గరున్న సినిమాలకు తోడు.. కొన్ని కొత్త చిత్రాలు కొని పెట్టి ‘ఆహా’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మొదలుపెట్టారాయన. వాటితో సరిపెట్టకుండా సొంతంగా వెబ్ సిరీస్లు తయారు చేసి అందులో రిలీజ్ చేశారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సినిమాల్ని ‘ఆహా’లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
‘భానుమతి రామకృష్ణ’ సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. ఐతే ఇలా నిలకడగా కొత్త సినిమాల్ని డైరెక్ట్గా రిలీజ్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డిజిటల్ హక్కుల్ని ఎక్స్క్లూజివ్గా తీసుకోవాలన్నా ఖర్చు ఎక్కువే.
అందుకే అరవింద్ సెకండ్ హ్యాండ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఆల్రెడీ వేరే ఫ్లాట్ ఫామ్స్లో రిలీజైన సినిమాల్ని తీసుకుని కొంచెం లేటుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం వేరే ఓటీటీలతో టై అప్ అవుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఐదారు రోజులు ఆలస్యంగా ‘ఆహా’లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనే ఉన్న ‘ఫోరెన్సిక్’ చిత్రాన్ని కూడా తీసుకుని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ను కూడా ఇలాగే రిలీజ్ చేయబోతున్నారట. ఇంకా అమేజాన్లో ఉన్న ‘ట్రాన్స్’ హక్కులు కూడా తీసుకుని తెలుగు డబ్బింగ్తో రిలీజ్ చేశారు.
ఇది ఎక్స్క్లూజివ్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్. వేరే ఫ్లాట్ ఫామ్స్లో వేరే భాషల్లో ఉన్న చిత్రాల్ని తీసుకుని అనువాదం చేసి ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ సినిమాలు తీసుకుని నేరుగా రిలీజ్ చేయడం, లేదంటే అనువాదం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో కంటెంట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు వారు.
This post was last modified on August 6, 2020 2:07 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…