Movie News

అల్లు వారి సెకండ్ హ్యాండ్ యాపారం

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలే నడుపుతాయని.. అది చాలా పెద్ద వ్యవహారం అని.. పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుందని.. ఓటీటీ మొదలుపెట్టినా దాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ ఆలోచన తప్పు అని రుజువు చేశాడు అల్లు అరవింద్.

ఓ నిర్మాతగా తన దగ్గరున్న సినిమాలకు తోడు.. కొన్ని కొత్త చిత్రాలు కొని పెట్టి ‘ఆహా’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మొదలుపెట్టారాయన. వాటితో సరిపెట్టకుండా సొంతంగా వెబ్ సిరీస్‌లు తయారు చేసి అందులో రిలీజ్ చేశారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సినిమాల్ని ‘ఆహా’లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

‘భానుమతి రామకృష్ణ’ సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. ఐతే ఇలా నిలకడగా కొత్త సినిమాల్ని డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డిజిటల్ హక్కుల్ని ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకోవాలన్నా ఖర్చు ఎక్కువే.

అందుకే అరవింద్ సెకండ్ హ్యాండ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఆల్రెడీ వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజైన సినిమాల్ని తీసుకుని కొంచెం లేటుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం వేరే ఓటీటీలతో టై అప్ అవుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఐదారు రోజులు ఆలస్యంగా ‘ఆహా’లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనే ఉన్న ‘ఫోరెన్సిక్’ చిత్రాన్ని కూడా తీసుకుని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ను కూడా ఇలాగే రిలీజ్ చేయబోతున్నారట. ఇంకా అమేజాన్‌లో ఉన్న ‘ట్రాన్స్’ హక్కులు కూడా తీసుకుని తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు.

ఇది ఎక్స్‌క్లూజివ్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్. వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో వేరే భాషల్లో ఉన్న చిత్రాల్ని తీసుకుని అనువాదం చేసి ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ సినిమాలు తీసుకుని నేరుగా రిలీజ్ చేయడం, లేదంటే అనువాదం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో కంటెంట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు వారు.

This post was last modified on August 6, 2020 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

3 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

9 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

9 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago