ఇంకో నెలన్నరలో విడుదల కాబోయే ఆది పురుష్ మీద దానికి ఖర్చు పెట్టినంత రేంజ్ లో హైప్ లేదు కానీ టీజర్ టైంలో వచ్చే నెగటివిటీని పోగొట్టేందుకు కావలసిన ప్లాన్ ని టి సిరీస్ సంస్థ సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న జరగబోయే ట్రైలర్ లాంచ్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 150 నుంచి 250 థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్టు వచ్చేసింది. ఈ కౌంట్ అనూహ్యంగా పెరగొచ్చని అంటున్నారు. మీడియా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఏఎంబి మాల్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అందరికీ త్రీడి వెర్షనే చూపించబోతున్నారు.
ఊహలకు అందని విధంగా మూడు నిమిషాల దాకా ఉన్న ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. గత ఏడాది వచ్చిన కామెంట్లకు బదులిచ్చేలా స్ట్రాంగ్ విజువల్స్ ని చూపించబోతున్నట్టు వినికిడి. సుమారు వెయ్యి కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. అంత రేట్లకు కొనడం గురించి పక్కనపెడితే టాకే ఆడియన్స్ ని తండోపతండాలుగా హాళ్లకు తీసుకొస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. అన్ని రాష్ట్రాలలో తగినన్ని థియేటర్లు దక్కేలా నిర్మాతలు ఇప్పటికే పావులు కదుపుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు
ప్రభాస్ ప్రమోషన్లలో భాగం కాబోతున్నాడు. ఇకపై శ్రీరాముడి గాథ అంటే కొత్త తరానికి ముందు ఆది పురుష్ గుర్తొచ్చే రేంజ్ లో అవుట్ ఫుట్ వచ్చిందట. అయినా ఇలా చెప్పుకోవడం మాములే కానీ సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్లతో నిరాశలో అభిమానులకు దీని సక్సెస్ కిక్ ఇస్తుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని దర్శకుడు ఓం రౌత్ ఎలా వాడాడోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆర్ఆర్ఆర్ తరహాలో దీన్ని కూడా గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ పదమూడున జరగబోయే ప్రీమియర్ల రిపోర్ట్ మీదే అందరి చూపు ఉంది
This post was last modified on May 4, 2023 4:41 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…