Movie News

నెగిటివిటీ తగ్గిపోయేలా సూపర్ ప్లాన్

ఇంకో నెలన్నరలో విడుదల కాబోయే ఆది పురుష్ మీద దానికి ఖర్చు పెట్టినంత రేంజ్ లో హైప్ లేదు కానీ టీజర్ టైంలో వచ్చే నెగటివిటీని పోగొట్టేందుకు కావలసిన ప్లాన్ ని టి సిరీస్ సంస్థ సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న జరగబోయే ట్రైలర్ లాంచ్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 150 నుంచి 250 థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్టు వచ్చేసింది. ఈ కౌంట్ అనూహ్యంగా పెరగొచ్చని అంటున్నారు. మీడియా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఏఎంబి మాల్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అందరికీ త్రీడి వెర్షనే చూపించబోతున్నారు.

ఊహలకు అందని విధంగా మూడు నిమిషాల దాకా ఉన్న ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. గత ఏడాది వచ్చిన కామెంట్లకు బదులిచ్చేలా స్ట్రాంగ్ విజువల్స్ ని చూపించబోతున్నట్టు వినికిడి. సుమారు వెయ్యి కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. అంత రేట్లకు కొనడం గురించి పక్కనపెడితే టాకే ఆడియన్స్ ని తండోపతండాలుగా హాళ్లకు తీసుకొస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. అన్ని రాష్ట్రాలలో తగినన్ని థియేటర్లు దక్కేలా నిర్మాతలు ఇప్పటికే పావులు కదుపుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు

ప్రభాస్ ప్రమోషన్లలో భాగం కాబోతున్నాడు. ఇకపై శ్రీరాముడి గాథ అంటే కొత్త తరానికి ముందు ఆది పురుష్ గుర్తొచ్చే రేంజ్ లో అవుట్ ఫుట్ వచ్చిందట. అయినా ఇలా చెప్పుకోవడం మాములే కానీ సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్లతో నిరాశలో అభిమానులకు దీని సక్సెస్ కిక్ ఇస్తుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని దర్శకుడు ఓం రౌత్ ఎలా వాడాడోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆర్ఆర్ఆర్ తరహాలో దీన్ని కూడా గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ పదమూడున జరగబోయే ప్రీమియర్ల రిపోర్ట్ మీదే అందరి చూపు ఉంది

This post was last modified on May 4, 2023 4:41 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

2 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

2 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

2 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

3 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

3 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

3 hours ago