ఇంకో నెలన్నరలో విడుదల కాబోయే ఆది పురుష్ మీద దానికి ఖర్చు పెట్టినంత రేంజ్ లో హైప్ లేదు కానీ టీజర్ టైంలో వచ్చే నెగటివిటీని పోగొట్టేందుకు కావలసిన ప్లాన్ ని టి సిరీస్ సంస్థ సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న జరగబోయే ట్రైలర్ లాంచ్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 150 నుంచి 250 థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్టు వచ్చేసింది. ఈ కౌంట్ అనూహ్యంగా పెరగొచ్చని అంటున్నారు. మీడియా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఏఎంబి మాల్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అందరికీ త్రీడి వెర్షనే చూపించబోతున్నారు.
ఊహలకు అందని విధంగా మూడు నిమిషాల దాకా ఉన్న ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. గత ఏడాది వచ్చిన కామెంట్లకు బదులిచ్చేలా స్ట్రాంగ్ విజువల్స్ ని చూపించబోతున్నట్టు వినికిడి. సుమారు వెయ్యి కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. అంత రేట్లకు కొనడం గురించి పక్కనపెడితే టాకే ఆడియన్స్ ని తండోపతండాలుగా హాళ్లకు తీసుకొస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. అన్ని రాష్ట్రాలలో తగినన్ని థియేటర్లు దక్కేలా నిర్మాతలు ఇప్పటికే పావులు కదుపుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు
ప్రభాస్ ప్రమోషన్లలో భాగం కాబోతున్నాడు. ఇకపై శ్రీరాముడి గాథ అంటే కొత్త తరానికి ముందు ఆది పురుష్ గుర్తొచ్చే రేంజ్ లో అవుట్ ఫుట్ వచ్చిందట. అయినా ఇలా చెప్పుకోవడం మాములే కానీ సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్లతో నిరాశలో అభిమానులకు దీని సక్సెస్ కిక్ ఇస్తుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని దర్శకుడు ఓం రౌత్ ఎలా వాడాడోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆర్ఆర్ఆర్ తరహాలో దీన్ని కూడా గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ పదమూడున జరగబోయే ప్రీమియర్ల రిపోర్ట్ మీదే అందరి చూపు ఉంది
This post was last modified on May 4, 2023 4:41 pm
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…