Allari naresh
ఒకప్పుడు తెలుగులో కామెడీ సినిమాలు వెల్లువలా వచ్చేవి. కామెడీ సినిమాలు తీయడానికే చాలామంది దర్శకులు ఉండేవాళ్లు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు తిరుగులేని కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవాళ్లు. వీళ్ల వల్ల చాలామంది కామెడీ రైటర్లకు పని ఉండేది.
అలాగే మరే ఇండస్ట్రీలో లేని విధంగా రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఎప్పుడూ బిజీగా ఉంటుండేవాళ్లు. కానీ ఈ వైభవమంతా గత పది పదిహేనేళ్లలో కరిగిపోయింది. కామెడీ తీసే లెజెండరీ డైరెక్టర్లో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. నటీనటులు కూడా చాలామంది కాలం చేశారు. రచయితలు కనుమరుగయ్యారు. ఇప్పుడు తెలుగు సినిమాలు కామెడీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు కామెడీనే నమ్ముకుని సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేసుకుంటున్నాడు.
మీరెందుకు కామెడీ సినిమాలు చేయట్లేదు అని తన కొత్త చిత్రం ‘ఉగ్రం’ ప్రమోషన్ల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. అతను మారిన పరిస్థితులపై కుండబద్దలు కొట్టేలా మాట్లాడాడు. ‘‘ఇప్పుడు కామెడీ రాసేవాళ్లు ఎవరున్నారు? తీసేవాళ్లు ఎవరున్నారు? కామెడీ రాయడం చాలా కష్టం. ఎలాంటి ఇన్స్పిరేషన్ లేకుండా కొత్తగా కామెడీ రాయడం ఒక సవాల్.
అప్పట్లో మా నాన్న గారి దగ్గరే పదుల సంఖ్యలో రైటర్లు ఉండేవాళ్లు. అందరూ కలిసి ఒకే ప్రాజెక్టు చేసేవాళ్లు. అందరిలో మా పేరు వస్తే చాలు అనుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు పేరు తెచ్చకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా ఇప్పుడు చాలా లిమిటేషన్ల మధ్య పని చేయాల్సి వస్తోంది. ‘కితకితలు’ లాంటి సినిమాను ఇప్పుడు తీస్తే బాడీ షేమింగ్ అని గొడవ చేస్తారు. స్వచ్ఛమైన కామెడీతో కథలు రాయడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది’’ అని నరేష్ అన్నాడు.
This post was last modified on May 4, 2023 2:48 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…