టాలీవుడ్లో సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్ల్లో ఎవరు మంచి డైరెక్టర్ అంటే.. మరో మాట లేకుండా సురేందర్ రెడ్డి పేరే చెబుతారు. ఇద్దరి ట్రాక్ రికార్డును గమనిస్తే.. సురేందర్కు మెహర్ దరిదాపుల్లో కూడా నిలవడు. మెహర్ కెరీర్లో రీమేక్ మూవీ అయిన ‘బిల్లా’ మినహాయిస్తే అన్నీ డిజాస్టర్లే. కానీ సురేందర్ అతనొక్కడే, కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చాడు. ధృవ, సైరా కూడా బాగానే ఆడాయి. ఐతే భిన్న ధ్రువాల్లాంటి ఈ ఇద్దరు దర్శకులతోనూ సినిమాలు లైన్లో పెట్టాడు నిర్మాత అనిల్ సుంకర.
ముందుగా సురేందర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. ఏజెంట్. అక్కినేని అఖిల్కు పెద్దగా మార్కెట్ లేకపోయినా.. సురేందర్ను నమ్మి ఏకంగా రూ.80 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు. కానీ ఆయన చేసిన రిస్క్ దారుణమైన ఫలితాన్నిచ్చింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సూరిని నమ్మితే కొంప మునిగిందని ఇప్పుడు అనిల్ లబోదిబోమనే పరిస్థితి.
ఐతే మంచి ట్రాక్ రికార్డున్న సురేందర్ అనిల్కు ఇలాంటి చేదు అనుభవాన్ని మిగిలిస్తే.. బ్యాడ్ ట్రాక్ రికార్డున్న మెహర్ను ఇప్పుడు నమ్ముకోవాల్సి వస్తోంది. మెహర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’కు కూడా అనిలే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. మెహర్ చివరి రెండు చిత్రాలు ‘షాడో’, ‘శక్తి’ భారీ డిజాస్టర్లు అయినా.. దాదాపు పదేళ్లుగా మెహర్ సినిమానే తీయకపోయినా.. అతణ్ని నమ్మి ‘భోళా శంకర్’ను అప్పగించాడు చిరు. కాకపోతే ఇది రీమేక్ మూవీ కావడం వల్ల మెహర్ తన క్రియేటివిటీతో ఏం చేసేస్తాడో అని కంగారు పడాల్సిన అవసరం లేదు.
చిరు ‘వాల్తేరు వీరయ్య’తో మంచి ఊపుమీదున్నాడు. ‘భోళా శంకర్’ సగటు మాస్ సినిమాలా ఉంటుందని ముందే అందరూ ఒక అంచనాతో ఉన్నారు కాబట్టి సడెన్ షాకులేమీ ఉండకపోవచ్చు. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. పెడుతున్న ఖర్చుతో పోలిస్తే మెరుగ్గానే బిజినెస్ అయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ‘ఏజెంట్’ చేసిన నష్టాన్ని అనిల్ ఈ సినిమాతో ఎంతమేర పూడ్చుకుంటాడో చూడాలి.
గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న 'మా ఇంటి బంగారం' వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా…
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావొస్తుంది. కానీ ఆకాశం నుంచి చుక్క నీటి జాడలేదు. మేఘాలు మొఖం చాటేశాయి. ఇదంతా…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…