Movie News

సెలబ్రెటీల చావు.. ఇదేం పైశాచికత్వం?

సోషల్ మీడియా కాలంలో ఎవరు ముందు ఒక న్యూస్‌ను బ్రేక్ చేస్తారనే విషయంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఆ క్రెడిట్ కోసమని.. సోషల్ మీడియాలో జనాలు చూపించే అత్యుత్సాహం పుణ్యమా అని.. సెలబ్రెటీలు బతికుండగానే చంపేస్తున్నారు. గతంలో వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్.. ఇలా చాలామంది ప్రముఖులు తాము చావలేదని.

బతికే ఉన్నామని వీడియోలు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు సీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబీకులు ఇలాగే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. శరత్ బాబు కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవం. ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనది తీవ్ర అనారోగ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా నెటిజన్లు ఫేక్ న్యూస్‌లను ప్రచారంలోకి తేవడం విచారకరం.

శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎవరో ఒకరు న్యూస్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఎవరో ఊరూ పేరు లేని వాళ్లు ఇలా చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. దారుణమైన విషయం ఏంటంటే వెరిఫైడ్ హ్యాండిల్స్ నుంచి ఈ న్యూస్ బయటికి వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఎవరో చెప్పారని చావు వార్తను ఎలా బ్రేక్ చేస్తారన్నది అర్థం కాని విషయం. కొందరు తమ హ్యాండిల్స్‌కు రీచ్ పెరగాలని కావాలనే ఇలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.

కానీ ఎక్కువమంది ఫాలో అయ్యే వెరిఫైడ్ హ్యాండిల్స్ కొంచెం చూస్కుని, ఆచితూచి పోస్టులు పెట్టాల్సిన అవసరం ఉంది. శరత్ బాబు ప్రాణాలతోనే ఉన్నారని.. అనారోగ్యం నుంచి కొంచెం కోలుకోవడంతో ఐసీయూ నుంచి రూంకి షిఫ్ట్ కూడా చేశారని శరత్ బాబు సోదరి తాజాగా మీడియాక అప్‌డేట్ ఇచ్చారు. బతికున్న మనిషి చనిపోయారని మీడియాలో ప్రచారం జరిగితే.. అది ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించి వార్తలు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.

This post was last modified on May 4, 2023 2:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

1 hour ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

3 hours ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

3 hours ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

4 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

4 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

5 hours ago