సోషల్ మీడియా కాలంలో ఎవరు ముందు ఒక న్యూస్ను బ్రేక్ చేస్తారనే విషయంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఆ క్రెడిట్ కోసమని.. సోషల్ మీడియాలో జనాలు చూపించే అత్యుత్సాహం పుణ్యమా అని.. సెలబ్రెటీలు బతికుండగానే చంపేస్తున్నారు. గతంలో వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్.. ఇలా చాలామంది ప్రముఖులు తాము చావలేదని.
బతికే ఉన్నామని వీడియోలు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు సీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబీకులు ఇలాగే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. శరత్ బాబు కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవం. ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనది తీవ్ర అనారోగ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా నెటిజన్లు ఫేక్ న్యూస్లను ప్రచారంలోకి తేవడం విచారకరం.
శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎవరో ఒకరు న్యూస్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఎవరో ఊరూ పేరు లేని వాళ్లు ఇలా చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. దారుణమైన విషయం ఏంటంటే వెరిఫైడ్ హ్యాండిల్స్ నుంచి ఈ న్యూస్ బయటికి వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఎవరో చెప్పారని చావు వార్తను ఎలా బ్రేక్ చేస్తారన్నది అర్థం కాని విషయం. కొందరు తమ హ్యాండిల్స్కు రీచ్ పెరగాలని కావాలనే ఇలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు ఫేక్ న్యూస్లను ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.
కానీ ఎక్కువమంది ఫాలో అయ్యే వెరిఫైడ్ హ్యాండిల్స్ కొంచెం చూస్కుని, ఆచితూచి పోస్టులు పెట్టాల్సిన అవసరం ఉంది. శరత్ బాబు ప్రాణాలతోనే ఉన్నారని.. అనారోగ్యం నుంచి కొంచెం కోలుకోవడంతో ఐసీయూ నుంచి రూంకి షిఫ్ట్ కూడా చేశారని శరత్ బాబు సోదరి తాజాగా మీడియాక అప్డేట్ ఇచ్చారు. బతికున్న మనిషి చనిపోయారని మీడియాలో ప్రచారం జరిగితే.. అది ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించి వార్తలు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.
This post was last modified on May 4, 2023 2:47 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…