సోషల్ మీడియా కాలంలో ఎవరు ముందు ఒక న్యూస్ను బ్రేక్ చేస్తారనే విషయంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఆ క్రెడిట్ కోసమని.. సోషల్ మీడియాలో జనాలు చూపించే అత్యుత్సాహం పుణ్యమా అని.. సెలబ్రెటీలు బతికుండగానే చంపేస్తున్నారు. గతంలో వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్.. ఇలా చాలామంది ప్రముఖులు తాము చావలేదని.
బతికే ఉన్నామని వీడియోలు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు సీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబీకులు ఇలాగే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. శరత్ బాబు కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవం. ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనది తీవ్ర అనారోగ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా నెటిజన్లు ఫేక్ న్యూస్లను ప్రచారంలోకి తేవడం విచారకరం.
శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎవరో ఒకరు న్యూస్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఎవరో ఊరూ పేరు లేని వాళ్లు ఇలా చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. దారుణమైన విషయం ఏంటంటే వెరిఫైడ్ హ్యాండిల్స్ నుంచి ఈ న్యూస్ బయటికి వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఎవరో చెప్పారని చావు వార్తను ఎలా బ్రేక్ చేస్తారన్నది అర్థం కాని విషయం. కొందరు తమ హ్యాండిల్స్కు రీచ్ పెరగాలని కావాలనే ఇలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు ఫేక్ న్యూస్లను ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.
కానీ ఎక్కువమంది ఫాలో అయ్యే వెరిఫైడ్ హ్యాండిల్స్ కొంచెం చూస్కుని, ఆచితూచి పోస్టులు పెట్టాల్సిన అవసరం ఉంది. శరత్ బాబు ప్రాణాలతోనే ఉన్నారని.. అనారోగ్యం నుంచి కొంచెం కోలుకోవడంతో ఐసీయూ నుంచి రూంకి షిఫ్ట్ కూడా చేశారని శరత్ బాబు సోదరి తాజాగా మీడియాక అప్డేట్ ఇచ్చారు. బతికున్న మనిషి చనిపోయారని మీడియాలో ప్రచారం జరిగితే.. అది ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించి వార్తలు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.
This post was last modified on May 4, 2023 2:47 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…