Movie News

అమృత నోటీసులిచ్చింది.. కానీ వర్మకి కాదు

నిజ జీవిత వ్యక్తులు, సంఘటనల మీద సినిమాలు తీయడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఉంటాయి. అవతలి వాళ్లు హెచ్చరిస్తారు. వారిస్తారు. అభ్యర్థిస్తారు. కానీ దేనికీ వర్మ తలొగ్గడు సినిమా చుట్టూ ముసురుకునే వివాదాల్ని పబ్లిసిటీకి వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తుంటాడు.

ఇంకా చెప్పాలంటే వివాదాస్పదం అయ్యే.. మంచి పబ్లిసిటీ వచ్చే కథల్నే వర్మ ఎంచుకుంటాడు. ఈ మధ్య ఈ విషయంలో వర్మ ఈ మధ్య మరీ శ్రుతిమించి పోతున్న సంగతి తెలిసిందే.

మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత ప్రేమ వ్యవహారం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో వర్మ ‘మర్డర్’ పేరుతో ఓ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అమృత వ్యవహారంలో తప్పెవరిది, ఒప్పెవరిది అన్నది పక్కన పెడితే ఇప్పటికే భర్తను కోల్పోయి.. ఈ మధ్యే తండ్రినీ దూరం చేసుకుని తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటోందామె.

ఆ ఇద్దరి మరణాలకూ కారణం తనే అంటూ సొసైటీ నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతనూ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆమె మీద సినిమా తీయడం ఎంత వరకు సబబన్నది వర్మ ఆలోచించాలని ఈ చిత్రాన్ని ప్రకటించినపుడు అందరూ అన్నారు. కానీ వర్మ పట్టించుకోలేదు. దీంతో అమృత ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమైంది.

‘మర్డర్’ సినిమా నిర్మాతలకు అమృత కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. ఐతే చిత్ర నిర్మాతలుగా పేరు పడ్డ నట్టి క్రాంతి, నట్టి కరుణలకు మాత్రమే అమృత నోటీసులు పంపింది.

ఈ చిత్రానికి సమర్పకుడు, నిర్మాణ భాగస్వామి, సినిమా మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్న రామ్ గోపాల్ వర్మకు మాత్రం అమృత నోటీసులు పంపకపోవడం గమనార్హం. మర్డర్ సినిమా విడుదలను ఆపాలని, పబ్లిసిటీని కూడా వెంటనే నిలిపివేయాలని కోర్టును అమృత కోరింది. ఈ నెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై, వారి వాదనను తెలపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

This post was last modified on August 5, 2020 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

60 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago