Movie News

మహేష్ ఫ్యాన్స్‌ను బోల్తా కొట్టించిన ‘పరశురామ్’

ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే తీశాడు యువ దర్శకుడు పరశురామ్. ఐతే అతడి చివరి సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి.. పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టడంతో అతడి రేంజ్ మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం సంపాదించాడు. ఈ సినిమా ఓ రేంజిలో ఉంటుందంటూ పరశురామ్ ఇంతకుముందు చేసిన ప్రకటన అభిమానుల్ని మురిపించింది.

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అంటూ సినిమా పేరు కూడా ప్రకటించారు. ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు చిత్ర బృందం ఏం విశేషం పంచుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ రోజు టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

స్వయంగా దర్శకుడు పరశురామే ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒక ట్విట్టర్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ పోస్టు కనిపిస్తున్న అకౌంట్ ఫేక్. పరశురామ్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి తరచుగా పోస్టులో పెడుతున్నారు.

మహేష్ సినిమా దర్శకుడు అని అతడి ఫ్యాన్స్ ఈ అకౌంట్‌ను ఫాలో అయిపోతున్నారు. అందులో వచ్చే అప్ డేట్లను నమ్మేస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు కోసం తమన్ సినిమా టైటిల్ ట్రాక్ రెడీ చేసేశాడని నమ్మేస్తున్నారు. కానీ ఆ రోజు ఏదో ఒక విశేషం పంచుకోవడం వాస్తవమే కానీ.. ఈ ట్వీట్ నమ్మి టైటిల్ ట్రాకే రిలీజ్ చేస్తారనుకుంటే పొరబాటే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.

This post was last modified on August 5, 2020 2:22 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

7 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

7 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

8 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

8 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

8 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

8 hours ago