ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే తీశాడు యువ దర్శకుడు పరశురామ్. ఐతే అతడి చివరి సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి.. పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టడంతో అతడి రేంజ్ మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం సంపాదించాడు. ఈ సినిమా ఓ రేంజిలో ఉంటుందంటూ పరశురామ్ ఇంతకుముందు చేసిన ప్రకటన అభిమానుల్ని మురిపించింది.
కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అంటూ సినిమా పేరు కూడా ప్రకటించారు. ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు చిత్ర బృందం ఏం విశేషం పంచుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ రోజు టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
స్వయంగా దర్శకుడు పరశురామే ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒక ట్విట్టర్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ పోస్టు కనిపిస్తున్న అకౌంట్ ఫేక్. పరశురామ్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి తరచుగా పోస్టులో పెడుతున్నారు.
మహేష్ సినిమా దర్శకుడు అని అతడి ఫ్యాన్స్ ఈ అకౌంట్ను ఫాలో అయిపోతున్నారు. అందులో వచ్చే అప్ డేట్లను నమ్మేస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు కోసం తమన్ సినిమా టైటిల్ ట్రాక్ రెడీ చేసేశాడని నమ్మేస్తున్నారు. కానీ ఆ రోజు ఏదో ఒక విశేషం పంచుకోవడం వాస్తవమే కానీ.. ఈ ట్వీట్ నమ్మి టైటిల్ ట్రాకే రిలీజ్ చేస్తారనుకుంటే పొరబాటే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.
This post was last modified on August 5, 2020 2:22 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…