దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో దగ్గుబాటి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కి ఆలస్యం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫస్ట్ కాపీ ను దర్శకుడు తేజ నిర్మాతలు జెమిని కిరణ్ కి అలాగే సురేష్ బాబు కి అప్పగించేసి తన నెక్స్ట్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయాడు. సినిమా రిలీజ్ ఎప్పుడనేది తేజకి కూడా తెలియని పరిస్థితి. తాజాగా గోపీచంద్ తో చేసిన ఇంటర్వ్యూ లో తేజకి అహింస రిలీజ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి తేజ చెప్పిన ఆన్సర్ ఎదురుగా ఉన్న గోపీచంద్ కి కూడా నవ్వు తెప్పించింది.
సినిమాకి సురేష్ బాబునే నిర్మాత కదా, రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుంది ? అంటూ గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ దీనికి సురేష్ బాబు , జెమిని కిరణ్ ఇద్దరు నిర్మాతలు. రెండు ఐరావతాలకు మనం ఏం చెప్తాం ? అని కామెంట్ చేశారు. ఇక నిర్మాతగా జెమిని కిరణ్ పేరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుక సురేష్ బాబు కూడా ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం ఎందుకో ? సురేష్ బాబు ఏం ప్లాన్ చేస్తున్నారో ? ఆయనకే తెలియాలి.
This post was last modified on May 3, 2023 1:23 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…