దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో దగ్గుబాటి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కి ఆలస్యం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫస్ట్ కాపీ ను దర్శకుడు తేజ నిర్మాతలు జెమిని కిరణ్ కి అలాగే సురేష్ బాబు కి అప్పగించేసి తన నెక్స్ట్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయాడు. సినిమా రిలీజ్ ఎప్పుడనేది తేజకి కూడా తెలియని పరిస్థితి. తాజాగా గోపీచంద్ తో చేసిన ఇంటర్వ్యూ లో తేజకి అహింస రిలీజ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి తేజ చెప్పిన ఆన్సర్ ఎదురుగా ఉన్న గోపీచంద్ కి కూడా నవ్వు తెప్పించింది.
సినిమాకి సురేష్ బాబునే నిర్మాత కదా, రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుంది ? అంటూ గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ దీనికి సురేష్ బాబు , జెమిని కిరణ్ ఇద్దరు నిర్మాతలు. రెండు ఐరావతాలకు మనం ఏం చెప్తాం ? అని కామెంట్ చేశారు. ఇక నిర్మాతగా జెమిని కిరణ్ పేరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుక సురేష్ బాబు కూడా ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం ఎందుకో ? సురేష్ బాబు ఏం ప్లాన్ చేస్తున్నారో ? ఆయనకే తెలియాలి.
This post was last modified on May 3, 2023 1:23 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…