దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో దగ్గుబాటి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కి ఆలస్యం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫస్ట్ కాపీ ను దర్శకుడు తేజ నిర్మాతలు జెమిని కిరణ్ కి అలాగే సురేష్ బాబు కి అప్పగించేసి తన నెక్స్ట్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయాడు. సినిమా రిలీజ్ ఎప్పుడనేది తేజకి కూడా తెలియని పరిస్థితి. తాజాగా గోపీచంద్ తో చేసిన ఇంటర్వ్యూ లో తేజకి అహింస రిలీజ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి తేజ చెప్పిన ఆన్సర్ ఎదురుగా ఉన్న గోపీచంద్ కి కూడా నవ్వు తెప్పించింది.
సినిమాకి సురేష్ బాబునే నిర్మాత కదా, రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుంది ? అంటూ గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ దీనికి సురేష్ బాబు , జెమిని కిరణ్ ఇద్దరు నిర్మాతలు. రెండు ఐరావతాలకు మనం ఏం చెప్తాం ? అని కామెంట్ చేశారు. ఇక నిర్మాతగా జెమిని కిరణ్ పేరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుక సురేష్ బాబు కూడా ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం ఎందుకో ? సురేష్ బాబు ఏం ప్లాన్ చేస్తున్నారో ? ఆయనకే తెలియాలి.
This post was last modified on May 3, 2023 1:23 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…