దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో దగ్గుబాటి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కి ఆలస్యం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫస్ట్ కాపీ ను దర్శకుడు తేజ నిర్మాతలు జెమిని కిరణ్ కి అలాగే సురేష్ బాబు కి అప్పగించేసి తన నెక్స్ట్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయాడు. సినిమా రిలీజ్ ఎప్పుడనేది తేజకి కూడా తెలియని పరిస్థితి. తాజాగా గోపీచంద్ తో చేసిన ఇంటర్వ్యూ లో తేజకి అహింస రిలీజ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి తేజ చెప్పిన ఆన్సర్ ఎదురుగా ఉన్న గోపీచంద్ కి కూడా నవ్వు తెప్పించింది.
సినిమాకి సురేష్ బాబునే నిర్మాత కదా, రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుంది ? అంటూ గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ దీనికి సురేష్ బాబు , జెమిని కిరణ్ ఇద్దరు నిర్మాతలు. రెండు ఐరావతాలకు మనం ఏం చెప్తాం ? అని కామెంట్ చేశారు. ఇక నిర్మాతగా జెమిని కిరణ్ పేరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుక సురేష్ బాబు కూడా ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం ఎందుకో ? సురేష్ బాబు ఏం ప్లాన్ చేస్తున్నారో ? ఆయనకే తెలియాలి.
This post was last modified on May 3, 2023 1:23 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…