ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తన పాన్ ఇండియా భారీ లైనప్ లో మారుతికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఎనౌన్స్ మెంట్ ,ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టేసి మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశారు. ఈ సినిమాలో డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ తరహా పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. కేరెక్టర్ , డైలాగ్స్ అన్నీ అదే తరహాలో ఒక్కప్పటి ప్రభాస్ ను గుర్తుచేసేలా ఉండబోతున్నాయి.
అయితే ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ ఇవ్వకుండా షూటింగ్ చేసేస్తున్న టీంకి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాకిడి ఎదురవుతూనే ఉంది. కానీ వాటిని పట్టించుకోకుండా ఓ ప్రాపర్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే ఈ సినిమా గురించి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా మొదలు కాకముందే మారుతితో ప్రభాస్ అనే న్యూస్ బయటికి వచ్చేసింది. ఆ క్షణం నుండి ఈ కాంబో మీద ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ, నిస్పృహ వ్యక్తం చేశారు. మారుతితో సినిమా వద్దని ఫ్యాన్స్ ట్విటర్ లో ట్రెండ్ చేసే వరకూ వెళ్లింది. దాంతో మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఫ్యాన్స్ సంతోష పెట్టే అప్ డేట్ తో సినిమా సంగతి చెప్పాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ , మారుతి కాంబో మూవీ థియేటర్స్ లోకి రానుంది. అప్పటి వరకు ఇలా సైలెంట్ గా ఒక్కో షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంటూ రెడీ చేస్తారు.
This post was last modified on May 3, 2023 6:16 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…