ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తన పాన్ ఇండియా భారీ లైనప్ లో మారుతికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఎనౌన్స్ మెంట్ ,ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టేసి మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశారు. ఈ సినిమాలో డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ తరహా పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. కేరెక్టర్ , డైలాగ్స్ అన్నీ అదే తరహాలో ఒక్కప్పటి ప్రభాస్ ను గుర్తుచేసేలా ఉండబోతున్నాయి.
అయితే ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ ఇవ్వకుండా షూటింగ్ చేసేస్తున్న టీంకి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాకిడి ఎదురవుతూనే ఉంది. కానీ వాటిని పట్టించుకోకుండా ఓ ప్రాపర్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే ఈ సినిమా గురించి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా మొదలు కాకముందే మారుతితో ప్రభాస్ అనే న్యూస్ బయటికి వచ్చేసింది. ఆ క్షణం నుండి ఈ కాంబో మీద ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ, నిస్పృహ వ్యక్తం చేశారు. మారుతితో సినిమా వద్దని ఫ్యాన్స్ ట్విటర్ లో ట్రెండ్ చేసే వరకూ వెళ్లింది. దాంతో మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఫ్యాన్స్ సంతోష పెట్టే అప్ డేట్ తో సినిమా సంగతి చెప్పాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ , మారుతి కాంబో మూవీ థియేటర్స్ లోకి రానుంది. అప్పటి వరకు ఇలా సైలెంట్ గా ఒక్కో షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంటూ రెడీ చేస్తారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…