సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడని చెప్పలేం కానీ.. అతడికంటూ ఒక స్థాయి ఉంది. తొలి సినిమా అతనొక్కడే మొదలుకుని.. కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్బస్టర్లు.. ధృవ, సైరా లాంటి డీసెంట్ మూవీస్తో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
తన కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు. అశోక్, అతిథి, ఊసరవెల్లి అనుకున్నంతగా ఆడలేదు. కిక్-2 అయితే డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమాలేవీ చేయని డ్యామేజ్ అతడికి ఏజెంట్ మూవీ చేసింది. సురేందర్ నుంచి ఇంత పేలవమైన సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమాను మొదలుపెట్టినట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పడంతో ఇప్పుడు మొత్తం నిందంతా సురేందరే మోయాల్సి వస్తోంది. ఇది అతడికి మామూలు డ్యామేజ్ కాదు. ఐతే ఏజెంట్ మూవీతో కేవలం పేరే కాదు.. డబ్బులూ పోగొట్టుకున్నాడు సురేందర్.
ఏజెంట్ మూవీకి సురేందర్ దర్శకుడే కాదు.. నిర్మాత కూడా. సరెండర్ టు సినిమా పేరుతో కొత్త బేనర్ పెట్టి ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారాడతను. ఐతే ఈ సినిమా కోసం అతను ప్రత్యేకంగా డబ్బులేం పెట్టలేదు. దర్శకులు ఇలా బేనర్ పెట్టి తమ రెమ్యూనరేషన్నే పెట్టుబడిగా పెట్టడం ఇప్పుడు ట్రెండ్.
సినిమా బాగా ఆడి మంచి లాభాలు వస్తే వాటా తీసుకుంటారు. ఇలాంటపుడు సినిమా హిట్ అయితే పారితోషకాన్ని మించి రెవెన్యూ వస్తుంది. కానీ తేడా కొడితే అంతే సంగతులు. సురేందర్ విషయంలో రెండోదే జరిగింది. రూ.80 కోట్ల బడ్జెట్లో (నిర్మాతల ప్రకారం) తెరకెక్కిన సినిమా థియేటర్ల నుంచి రూ.10 కోట్ల షేర్ కూడా రాబట్టలేని పరిస్థితి. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కలిపినా ఓవరాల్గా పెట్టుబడిలో సగం కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఆల్రెడీ డెఫిషిట్లో సినిమాను రిలీజ్ చేసి కూడా.. బయ్యర్లకు ఇప్ఉపడు సెటిల్ చేయాల్సిన స్థితిలో ఉన్నాడు అనిల్. ఇక దర్శకుడికి ఏమిస్తాడు? అంటే సురేందర్కు ఈ సినిమా వల్ల ఆర్థికంగా ఏమీ మిగలకపోవచ్చు. అంటే పేరుతో పాటు డబ్బులూ పోగొట్టుకున్నాడన్నమాట సూరి.
This post was last modified on May 3, 2023 1:04 pm
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…