సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడని చెప్పలేం కానీ.. అతడికంటూ ఒక స్థాయి ఉంది. తొలి సినిమా అతనొక్కడే మొదలుకుని.. కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్బస్టర్లు.. ధృవ, సైరా లాంటి డీసెంట్ మూవీస్తో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
తన కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు. అశోక్, అతిథి, ఊసరవెల్లి అనుకున్నంతగా ఆడలేదు. కిక్-2 అయితే డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమాలేవీ చేయని డ్యామేజ్ అతడికి ఏజెంట్ మూవీ చేసింది. సురేందర్ నుంచి ఇంత పేలవమైన సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమాను మొదలుపెట్టినట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పడంతో ఇప్పుడు మొత్తం నిందంతా సురేందరే మోయాల్సి వస్తోంది. ఇది అతడికి మామూలు డ్యామేజ్ కాదు. ఐతే ఏజెంట్ మూవీతో కేవలం పేరే కాదు.. డబ్బులూ పోగొట్టుకున్నాడు సురేందర్.
ఏజెంట్ మూవీకి సురేందర్ దర్శకుడే కాదు.. నిర్మాత కూడా. సరెండర్ టు సినిమా పేరుతో కొత్త బేనర్ పెట్టి ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారాడతను. ఐతే ఈ సినిమా కోసం అతను ప్రత్యేకంగా డబ్బులేం పెట్టలేదు. దర్శకులు ఇలా బేనర్ పెట్టి తమ రెమ్యూనరేషన్నే పెట్టుబడిగా పెట్టడం ఇప్పుడు ట్రెండ్.
సినిమా బాగా ఆడి మంచి లాభాలు వస్తే వాటా తీసుకుంటారు. ఇలాంటపుడు సినిమా హిట్ అయితే పారితోషకాన్ని మించి రెవెన్యూ వస్తుంది. కానీ తేడా కొడితే అంతే సంగతులు. సురేందర్ విషయంలో రెండోదే జరిగింది. రూ.80 కోట్ల బడ్జెట్లో (నిర్మాతల ప్రకారం) తెరకెక్కిన సినిమా థియేటర్ల నుంచి రూ.10 కోట్ల షేర్ కూడా రాబట్టలేని పరిస్థితి. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కలిపినా ఓవరాల్గా పెట్టుబడిలో సగం కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఆల్రెడీ డెఫిషిట్లో సినిమాను రిలీజ్ చేసి కూడా.. బయ్యర్లకు ఇప్ఉపడు సెటిల్ చేయాల్సిన స్థితిలో ఉన్నాడు అనిల్. ఇక దర్శకుడికి ఏమిస్తాడు? అంటే సురేందర్కు ఈ సినిమా వల్ల ఆర్థికంగా ఏమీ మిగలకపోవచ్చు. అంటే పేరుతో పాటు డబ్బులూ పోగొట్టుకున్నాడన్నమాట సూరి.
This post was last modified on May 3, 2023 1:04 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…