గత ఏడాది పొన్నియన్ సెల్వన్-2 రిలీజైనపుడు తెలుగులో బాగా డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం సినిమాను ఆహా ఓహో అన్నారు. తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. అసలు కథే అర్థం కాకపోవడం.. మన ప్రేక్షకులు ఆశించే బాహుబలి తరహా గూస్ బంప్స్ మూమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది.
మొత్తంగా తెలుగు బాక్సాపీస్ దగ్గర ఈ చిత్రానికి నిరాశాజనక ఫలితం తప్పలేదు. ఐతే థియేటర్ల నుంచి వెళ్లిపోయాక ఓటీటీలో చూసిన జనాలు.. సినిమా పర్లేదని అన్నారు. మరీ అంత తీసిపడేయదగ్గ చిత్రం కాదన్నారు. మరోవైపు తమిళనాట మాత్రం ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టింది. తమిళ సినీ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. రెండో భాగం విషయానికి వస్తే తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది. తమిళంలో మాత్రం హైప్ తక్కువగా లేదు.
ఐతే ఫస్ట్ పార్ట్తో పోలిస్తే రెండో భాగానికి తెలుగులో మంచి టాకే వచ్చింది. తొలి భాగం చూశాక ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంలో ప్రేక్షకులు ఒక అంచనాతో ఉన్నారు. కథ పరంగా కొంచెం క్లారిటీ వచ్చింది. సినిమాలో కూడా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఐతే ఈ టాక్కు తగ్గట్లు వసూళ్లు లేకపోవడమే ఆశ్చర్యకరం. ఫస్ట్ పార్ట్ కంటే కూడా తక్కువ వసూళ్లే రాబడుతోందీ సినిమా. తొలి వీకెండ్లో 5 కోట్లకు అటు ఇటుగా షేర్ వచ్చింది. వీకెండ్ తర్వాత సినిమా డల్లయింది.
ఐతే తెలుగు వెర్షన్ మీద పెద్ద అంచనాలు లేవు కాబట్టి ఓకే కానీ.. ఫస్ట్ పార్ట్ను నెత్తిన పెట్టుకున్న తమిళ ప్రేక్షకులు కూడా సెకండ్ పార్ట్ను అనుకున్నంత స్థాయిలో ఆదరించట్లేదు. పీఎస్-1 టికెట్ల కోసం ఎగబడ్డట్లు దీని కోసం ఎగబడట్లేదు. ఆక్యుపెన్సీలు మరీ గొప్పగా ఏమీ లేవు. బాహుబలి-1 బ్లాక్ బస్టర్ అయ్యాక రెండో భాగానికి దేశవ్యాప్తంగా ఎలాంటి యుఫోరియా నెలకొందో చూశాం. కానీ తమిళం వరకు పీఎస్-2 అలాంటి మ్యాజిక్ను రీక్రియేట్ చేయలేకపోయింది. వసూళ్లు కూడా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే తక్కువే వస్తున్నాయి. మరి సమస్య ఎక్కడుందో?
This post was last modified on May 3, 2023 1:02 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…