సినిమా హీరోలు కనబడితే వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు సామాన్య జనాలు ఎగబడటం సాధారణం. ఐతే ఆ హీరోలు ఎలాంటి మూడ్లో ఉన్నారు.. మనం వారిని ఎక్కడ కలిశాం.. వారి ప్రైవసీ సంగతేంటి.. ఇలాంటివన్నీ కొంచెం చూస్కోవాలి. ఫొటోలు, సెల్ఫీలు దిగేటపుడు కనీసం అనుమతి అడగాలి.
అలా కాకుండా మన కోణంలో మనం ఆలోచిస్తూ దూసుకెళ్లిపోతే ఇబ్బందులు తప్పవు. ముంబయి ఎయిర్పోర్టులో షారుఖ్ ఖాన్తో్ సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిన ఒక అభిమానికి ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్ట్ నుంచి తన మేనేజర్ పూజా దడ్లానితో కలిసి బయటికి వస్తుండగా.. ఆయన్ని మీడియా వాళ్లతో పాటు అభిమానులు చుట్టుముట్టారు. ఐతే షారుఖ్ నడిచి వస్తుండగా.. ఒక ఫ్యాన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.
సెల్ఫీకి పోజ్ ఇవ్వమని కనీసం షారుఖ్ను అడక్కుండానే.. పక్కన నడుస్తూ మొబైల్తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఇది షారుఖ్కు చికాకు తెప్పించింది. వెంటనే చేత్లో ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడం.. వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అభిమానితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించాడంటూ కొందరు ఆయన్ని విమర్శిస్తుంటే.. కనీసం సెల్ఫీ కోసం పర్మిషన్ కూడా అడక్కుండా ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
అభిమానిని నెట్టేసే దృశ్యం మాత్రమే చూస్తే.. షారుఖ్ కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు అనిపించినా.. మొత్తం వీడియో చూస్తే మాత్రం అభిమానిదే తప్పు అని అర్థమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చిరాకు పుట్టి స్టార్లు ఫోన్లు విసిరేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వాళ్లతో పోలిస్తే షారుఖ్ కాస్త బెటర్గానే రియాక్టయినట్లే.
This post was last modified on May 3, 2023 12:55 pm
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…