Movie News

అత‌ను నా భ‌ర్త కాదు

త‌మిళ సీనియ‌ర్ నటుడు విజ‌య్ కుమార్‌, దివంగ‌త న‌టి మంజుల‌ల త‌న‌యురాలైన వ‌నిత ఎప్పుడూ వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.

ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ స‌మయంలో వారి పెళ్లి ఫొటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. ఐతే త‌ర్వాత ఇద్ద‌రూ గొడ‌వ ప‌డి విడిపోయారు. కాగా ఇటీవ‌లే పీట‌ర్ పాల్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంద‌ర్భంగా వ‌నిత ఒక ఎమోష‌న‌ల్ పోస్టు కూడా పెట్టింది. ఐతే మీడియాలో అంద‌రూ పీట‌ర్‌ను వ‌నిత మూడో భ‌ర్త‌గా పేర్కొన్నారు. ఇది వ‌నిత‌కు రుచించ‌కపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. పీట‌ర్ త‌న భ‌ర్త కాద‌ని ఆమె తేల్చిచెప్పింది. మీడియా తీరు ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

పీటర్‌ పాల్‌ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో ఓపిక పట్టాను. నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు. కానీ అన్ని మీడియా సంస్థలపై ఉన్న గౌరవంతో ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నానని, పీటర్‌ పాల్‌తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదు.. 2020లో కొన్ని రోజులపాటు మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అది కూడా ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయన భార్యని కాదు. అతను నా భర్త కాదు. వనిత విజయ్‌ కుమార్‌ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలు ఆపేయాలి. ఇప్పుడు నాకు భర్త లేడు. ఒంటరిగానే ఉంటున్నాను ఏ విషయానికి నేను బాధపడటం లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందరికి ఇదే నా విన్నపం అని సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టింది వ‌నిత‌.

తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on May 3, 2023 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago