తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజులల తనయురాలైన వనిత ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.
ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి పెళ్లి ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఐతే తర్వాత ఇద్దరూ గొడవ పడి విడిపోయారు. కాగా ఇటీవలే పీటర్ పాల్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా వనిత ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది. ఐతే మీడియాలో అందరూ పీటర్ను వనిత మూడో భర్తగా పేర్కొన్నారు. ఇది వనితకు రుచించకపోవడం ఆశ్చర్యకరం. పీటర్ తన భర్త కాదని ఆమె తేల్చిచెప్పింది. మీడియా తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్ఫ్యూజన్లో ఓపిక పట్టాను. నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు. కానీ అన్ని మీడియా సంస్థలపై ఉన్న గౌరవంతో ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నానని, పీటర్ పాల్తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదు.. 2020లో కొన్ని రోజులపాటు మేం రిలేషన్షిప్లో ఉన్నాం. అది కూడా ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయన భార్యని కాదు. అతను నా భర్త కాదు. వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలు ఆపేయాలి. ఇప్పుడు నాకు భర్త లేడు. ఒంటరిగానే ఉంటున్నాను ఏ విషయానికి నేను బాధపడటం లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందరికి ఇదే నా విన్నపం అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది వనిత.
తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 3, 2023 2:44 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…