తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజులల తనయురాలైన వనిత ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.
ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి పెళ్లి ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఐతే తర్వాత ఇద్దరూ గొడవ పడి విడిపోయారు. కాగా ఇటీవలే పీటర్ పాల్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా వనిత ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది. ఐతే మీడియాలో అందరూ పీటర్ను వనిత మూడో భర్తగా పేర్కొన్నారు. ఇది వనితకు రుచించకపోవడం ఆశ్చర్యకరం. పీటర్ తన భర్త కాదని ఆమె తేల్చిచెప్పింది. మీడియా తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్ఫ్యూజన్లో ఓపిక పట్టాను. నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు. కానీ అన్ని మీడియా సంస్థలపై ఉన్న గౌరవంతో ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నానని, పీటర్ పాల్తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదు.. 2020లో కొన్ని రోజులపాటు మేం రిలేషన్షిప్లో ఉన్నాం. అది కూడా ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయన భార్యని కాదు. అతను నా భర్త కాదు. వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలు ఆపేయాలి. ఇప్పుడు నాకు భర్త లేడు. ఒంటరిగానే ఉంటున్నాను ఏ విషయానికి నేను బాధపడటం లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందరికి ఇదే నా విన్నపం అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది వనిత.
తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 3, 2023 2:44 pm
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…