Movie News

సలార్ గురించి తెలియదన్న జగ్గుభాయ్

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో ఎక్కువ అంచనాలున్న వాటిలో సలార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ కోసం ఆదిపురుష్ కన్నా ఎక్కువగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాట వాస్తవం. అయితే అప్ డేట్స్ విషయంలో హోంబాలే ఫిలింస్ పక్కా ప్రీ ప్లానింగ్ తో లీక్స్ పెద్దగా బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. అసలు ఇది రెండు భాగాలా సింగిల్ పార్టా అనేది కూడా తెలియడం లేదు. ఇవాళ రామబాణం ప్రమోషన్స్ సందర్భంగా జగపతిబాబుని ఈ విషయమే మీడియా అడిగే ప్రయత్నం చేసింది.

విచిత్రంగా జగ్గు భాయ్ చెప్పిన సంగతి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఇప్పటిదాకా ఆయన కేవలం అయిదు రోజులు మాత్రమే సలార్ షూటింగ్ లో పాల్గొన్నారట. ప్రశాంత్ నీల్ లాంటి ప్యాషన్ ఉన్న దర్శకులను తాను ఏమీ అడిగనని నేరుగా సెట్స్ కి వెళ్ళిపోయి ఆ ఎగ్జైట్ మెంట్ ని ఆస్వాదిస్తానని చెప్పారు. పట్టుమని వారం రోజులు కూడా వెళ్ళలేదంటే ఇంకా చిత్రీకరణ చాలా బాలన్స్ ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇందులో మెయిన్ విలన్ జగపతి బాబే. రెండో ప్రతినాయకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ కథలో తండ్రికొడుకలనే ప్రచారం ఆల్రెడీ ఉంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం జగపతిబాబు పాత్ర సలార్ 2లోనే ఎక్కువ ఉంటుందట. అచ్చం బాహుబలి తరహాలో ఫస్ట్ పార్ట్ మొత్తం కొడుకు ట్రాక్ ని చూపించి సీక్వెల్ లో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి సీక్వెల్ లో అసలు సలార్ ఎవరు, అతనేం చేశాడు, ఏమయ్యాడు అనే లైన్ మీద చాలా డిఫరెంట్ గా సాగుతుందట. మరి ఇద్దరు ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తారా లేక ఒకరు చనిపోయి ఇంకొకరితో రివెంజ్ డ్రామా ప్లాన్ చేశారానేది వేచి చూడాలి. మొత్తానికి సలార్ పబ్లిసిటీ ప్రారంభం కాకుండానే దానికి సంబంధించిన విషయాలు షాకింగ్ గా ఉంటున్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది

This post was last modified on May 3, 2023 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago