బాలీవుడ్లో సినిమా జంటలు ఒక్కటి కావడం కొత్తేమీ కాదు. ఐతే సినిమా వాళ్లు కాకుండా హీరోయిన్ల చూపు వ్యాపారవేత్తలు, ఆ తర్వాత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. నవనీత్ కౌర్ లాంటి వాళ్లు రాజకీయ నేతల్ని పెళ్లాడి వాళ్లు కూడా రాజకీయాల్లోకి వచ్చేయడం గమనించవచ్చు.
ఇప్పుడు మరో బాలీవుడ్ కథానాయిక రాజకీయ నాయకుడితో పెళ్లికి రెడీ అయిపోయింది. ఆమే.. పరిణీతి చోప్రా. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ముంబయిలో ఈ జంట మీడియా కెమెరాలకు చిక్కుతూనే ఉంది. ఆల్రెడీ వీళ్ల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని గతంలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. అతి త్వరలోనే పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థః చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు ఇందుకు ముహూర్తం కూడా చూశాయి. ఎంగేజ్మెంట్ రోజే ఈ జంట ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఐతే నిశ్చితార్థం ఇప్పుడే జరిగినా పెళ్లికి మాత్రం తొందరపడట్లేదట ఈ జంట. ఈ ఏడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది ఆ వేడుక ఉండొచ్చు.
గతంలో పరిణీతి, రాఘవ్ రహస్యంగానే కలుసుకునే వారు కానీ కొన్ని నెలల నుంచి తమ బహిరంగంగానే తిరుగుతున్నారు. కెమెరాలకు దొరికేస్తున్నారు. లేడీస్ వెర్సస్ రిక్కీ బాల్ సినిమాతో కథానాయికగా పరిణీతి చోప్రా.. ఇప్పటిదాకా పాతిక సినిమాల దాకా చేసింది. ప్రస్తుతం ఆమె ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో చంకీలా సినిమా చేస్తోంది. పంజాబీ నటుడు దిల్జీత్ దోసాంజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. పెళ్లి తర్వాత కూడా పరిణీతి సినిమాల్లోనే కొనసాగుతుందట.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…