సూపర్ స్టార్ రజినీకాంత్ను కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా టార్గెట్ చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయనేమీ వైసీపీని కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి రాజకీయ విమర్శలూ చేయలేదు. కేవలం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడారనే ఒకే కారణంతో వైసీపీ శ్రేణులు ఆయన్ని దారుణంగా టార్గెట్ చేశాయి.
చీకేసిన టెంక ముఖం.. 3 రోజులు షూటింగ్ చేస్తే 4 రోజులు ఆసుపత్రిలో ఉంటాడు.. ఇలాంటి మాటలు రజినీ గురించి మాట్లాడ్డం వైసీపీలో అయినా అందరికీ రుచిస్తాయా అన్నది సందేహం. ఈ వ్యాఖ్యల పుణ్యమా అని.. వైసీపీ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తెలుగు వాళ్లే కాక తమిళులు కూడా తోడై వైసీపీని విపరీతంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. నాలుగు రోజుల ముందు మొదలైన ఈ చిచ్చు ఇంకా కూడా చల్లారలేదు. తమిళ జనాలు జగన్, వైసీపీ గాలి తీస్తూ పోస్టులు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. రజినీని వైసీపీ ఇంతటితో వదలదు అని.. ఆయన కొత్త సినిమా ‘జైలర్’ రిలీజైనపుడు చుక్కలు చూపించడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. లేదా ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా.. ఎలా టార్గెట్ చేస్తారో కొన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో తెలిసిందే. అలాగే టికెట్ల రేట్ల గురించి ఏవో వ్యాఖ్యలు చేశాడని నాని సినిమాను సైతం టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును పొగిడాడని ‘జైలర్’కు ఇబ్బందులు సృష్టిస్తారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి ఎదురు లేనపుడు ఇలాంటివి ఏం చేసినా చెల్లింది కానీ.. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న సమయంలో ఇలా చేస్తే అది బూమరాంగ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే రజినీ విషయంలో వైసీపీకి చాలా డ్యామేజ్ అయింది. తటస్థులు ఈ విషయంలో వైసీపీని తూర్పారబడుతున్నారు. ఇక రజినీ సినిమాను కూడా టార్గెట్ చేశారంటే జాతీయ స్థాయిలో అది మరింత పెద్ద చర్చకు దారి తీసి వైసీపీ పరువు పోవడం.. ఆ పార్టీకి చెప్పలేనంత డ్యామేజీ జరగడం ఖాయం.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…