Movie News

నిజంగా ‘జైలర్’తో పెట్టుకుంటారా?

సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా టార్గెట్ చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయనేమీ వైసీపీని కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి రాజకీయ విమర్శలూ చేయలేదు. కేవలం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడారనే ఒకే కారణంతో వైసీపీ శ్రేణులు ఆయన్ని దారుణంగా టార్గెట్ చేశాయి.

చీకేసిన టెంక ముఖం.. 3 రోజులు షూటింగ్ చేస్తే 4 రోజులు ఆసుపత్రిలో ఉంటాడు.. ఇలాంటి మాటలు రజినీ గురించి మాట్లాడ్డం వైసీపీలో అయినా అందరికీ రుచిస్తాయా అన్నది సందేహం. ఈ వ్యాఖ్యల పుణ్యమా అని.. వైసీపీ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తెలుగు వాళ్లే కాక తమిళులు కూడా తోడై వైసీపీని విపరీతంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. నాలుగు రోజుల ముందు మొదలైన ఈ చిచ్చు ఇంకా కూడా చల్లారలేదు. తమిళ జనాలు జగన్‌, వైసీపీ గాలి తీస్తూ పోస్టులు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రజినీని వైసీపీ ఇంతటితో వదలదు అని.. ఆయన కొత్త సినిమా ‘జైలర్’ రిలీజైనపుడు చుక్కలు చూపించడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. లేదా ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా.. ఎలా టార్గెట్ చేస్తారో కొన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో తెలిసిందే. అలాగే టికెట్ల రేట్ల గురించి ఏవో వ్యాఖ్యలు చేశాడని నాని సినిమాను సైతం టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును పొగిడాడని ‘జైలర్‌’కు ఇబ్బందులు సృష్టిస్తారనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి ఎదురు లేనపుడు ఇలాంటివి ఏం చేసినా చెల్లింది కానీ.. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న సమయంలో ఇలా చేస్తే అది బూమరాంగ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే రజినీ విషయంలో వైసీపీకి చాలా డ్యామేజ్ అయింది. తటస్థులు ఈ విషయంలో వైసీపీని తూర్పారబడుతున్నారు. ఇక రజినీ సినిమాను కూడా టార్గెట్ చేశారంటే జాతీయ స్థాయిలో అది మరింత పెద్ద చర్చకు దారి తీసి వైసీపీ పరువు పోవడం.. ఆ పార్టీకి చెప్పలేనంత డ్యామేజీ జరగడం ఖాయం.

This post was last modified on May 2, 2023 6:50 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

23 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

40 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

55 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

10 hours ago