స్టార్ హీరో సినిమా చేతిలో పడగానే సరిపోదు. అది జనంలోకి బలంగా రిజిస్టర్ అయ్యేలా మీడియాలో దాని గురించి క్రమం తప్పకుండా చర్చ జరిగేలా ఏదో ఒకటి చేయాలి. ఎంత పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో చేస్తున్నా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈ విషయంలో హరీష్, సుజిత్ లు ఒకరికతో మరొకరు పోటీ పడుతూ మిగిలినవారికి స్ఫూర్తినిస్తున్నారు. వీళ్లిద్దరి రెగ్యులర్ షూటింగులు ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. పవన్ గ్యాప్ లేకుండా ఒకరితర్వాత మరొకరికి పక్కా ప్లాన్ ప్రకారం డేట్లు ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.
ఇందులో విశేషం లేదు కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఎప్పటికప్పుడు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం, అప్ డేట్లు ఇవ్వడం, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ప్రాంతాల గురించి లీక్స్ వదలడం, హీరో లుక్ దాచకుండా ఎవరైనా ఫోటోలు దిగితే అభ్యంతర చెప్పకపోవడాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. వీటి వల్ల సోషల్ మీడియాలో బజ్ పెరుగుతున్న మాట వాస్తవం. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అనే నెగటివ్ ఫ్యాక్టర్ ని అభిమానుల మనసులో నుంచి తుడిచేయడానికి హరీష్ చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి.
ఇక సుజిత్ ఓజి ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా అనే భరోసా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. వీటితో పోల్చుకుంటే పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు బాగా వెనుక బడి ఉంది. దర్శకుడు క్రిష్ ట్రెండీగా ఆలోచించకపోవడం మైనస్ గా నిలుస్తోంది. ఇంత పెద్ద గ్రాండియర్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంత ఫోకస్ పబ్లిసిటీ మీద పెట్టాలి. షూటింగ్ కి బ్రేక్ పడినా సరే ఏదో ఒక సమాచారం బయటికి వదులుతూ ఉండాలి. ఇప్పుడు దీనికన్నా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల మీద ఎక్కువ హైప్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి అక్కర్లేదు.
This post was last modified on May 2, 2023 3:17 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…