స్టార్ హీరో సినిమా చేతిలో పడగానే సరిపోదు. అది జనంలోకి బలంగా రిజిస్టర్ అయ్యేలా మీడియాలో దాని గురించి క్రమం తప్పకుండా చర్చ జరిగేలా ఏదో ఒకటి చేయాలి. ఎంత పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో చేస్తున్నా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈ విషయంలో హరీష్, సుజిత్ లు ఒకరికతో మరొకరు పోటీ పడుతూ మిగిలినవారికి స్ఫూర్తినిస్తున్నారు. వీళ్లిద్దరి రెగ్యులర్ షూటింగులు ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. పవన్ గ్యాప్ లేకుండా ఒకరితర్వాత మరొకరికి పక్కా ప్లాన్ ప్రకారం డేట్లు ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.
ఇందులో విశేషం లేదు కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఎప్పటికప్పుడు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం, అప్ డేట్లు ఇవ్వడం, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ప్రాంతాల గురించి లీక్స్ వదలడం, హీరో లుక్ దాచకుండా ఎవరైనా ఫోటోలు దిగితే అభ్యంతర చెప్పకపోవడాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. వీటి వల్ల సోషల్ మీడియాలో బజ్ పెరుగుతున్న మాట వాస్తవం. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అనే నెగటివ్ ఫ్యాక్టర్ ని అభిమానుల మనసులో నుంచి తుడిచేయడానికి హరీష్ చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి.
ఇక సుజిత్ ఓజి ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా అనే భరోసా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. వీటితో పోల్చుకుంటే పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు బాగా వెనుక బడి ఉంది. దర్శకుడు క్రిష్ ట్రెండీగా ఆలోచించకపోవడం మైనస్ గా నిలుస్తోంది. ఇంత పెద్ద గ్రాండియర్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంత ఫోకస్ పబ్లిసిటీ మీద పెట్టాలి. షూటింగ్ కి బ్రేక్ పడినా సరే ఏదో ఒక సమాచారం బయటికి వదులుతూ ఉండాలి. ఇప్పుడు దీనికన్నా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల మీద ఎక్కువ హైప్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి అక్కర్లేదు.
This post was last modified on May 2, 2023 3:17 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…