Dil Raju
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి గత ఏడాది హీరోగా అరంగేట్రం చేశాడు ఆశిష్. అతడి తొలి చిత్రం రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హుషారు ఫేమ్ హర్ష రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి టైంలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది.
ఐతే ఈ సినిమా హిట్టో ఫ్లాపో ఆ టైంలో తనకే అర్థం కాని పరిస్థితి తలెత్తిందని రాజు ఇప్పుడు వ్యాఖ్యానించడం విశేషం. ఆశిష్ రెండో సినిమా సెల్ఫిష్ నుంచి ఒక పాటను లాంచ్ చేసిన సందర్భంగా రౌడీ బాయ్స్ గురించి రాజు మాట్లాడాడు.
రౌడీ బాయ్స్ రిలీజైనపుడు రెస్పాన్స్ చూసి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదు. కొందరేమో సినిమా బాగుందన్నారు. కొందరు డిఫరెంట్గా మాట్లాడారు. మా అబ్బాయి కాబట్టి బాగా ప్రమోట్ చేసి ఆడించారని అన్నారు. ఐతే ఏ సినిమాకైనా ఎంత రెవెన్యూ వచ్చిందన్నది ముఖ్యం. ఒక కొత్త హీరో స్థాయికి తగ్గట్లు ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. ఆశిష్ కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా చేశాడని ప్రేక్షకులు ప్రశంసించారు అని దిల్ రాజు అన్నాడు.
దిల్ రాజు అయితే ఏంటి.. డాష్ డాష్ అయితే ఏంటి అని కొంతమంది రెడీ ఉంటారని.. కాబట్టి కష్టపడాలని ఆశిష్ను ఉద్దేశించి రాజు వ్యాఖ్యానించడం విశేషం. సుకుమార్ శిష్యుడైన కాశి దర్శకత్వంలో ఆశిష్ రెండో సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సుకుమార్ నిర్మాణ భాగస్వామి కూడా. ఆశిష్ తొలి సినిమాను మించి ఉండాలని.. ఒక మంచి కథతో ఈ సినిమా చేస్తున్నామని.. సుకుమార్తో 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం కలిశామని రాజు తెలిపాడు. సెల్ఫిష్ చిత్రానికి మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్లతో పాటు మరో సంగీత దర్శకుడు కూడా పని చేస్తున్నాడని.. ఇలా బాలీవుడ్ కల్చర్ను టాలీవుడ్కు పరిచయం చేస్తున్నామని రాజు చెప్పాడు.
This post was last modified on May 2, 2023 7:04 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…