టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారిన ఏజెంట్ డిజాస్టర్ గురించి నిర్మాత అనిల్ సుంకర నాలుగో రోజే ఓపెనయ్యారు. ఒక సుదీర్ఘమైన ట్వీట్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించి తెరమీద కంటే ఆన్ లైన్లోనే పెద్ద ట్విస్టు ఇచ్చారు. అందులో బాగా హైలైట్ అవుతున్న పాయింట్ సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టామని, మధ్యలో కరోనా లాంటి ఇతర కారణాలు ప్రభావితం చేయడం వల్ల ఎంతో ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇకపై ఇలా జరగకుండా ఖచ్చితమైన ప్లానింగ్ తో ముందుకెళ్తామని ఎలాంటి సాకులు వెతకడం లేదని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు.
ఇది అభిమానుల మధ్యే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒక అగ్ర నిర్మాత సినిమా నాలుగో రోజు ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇలా బహిరంగంగా తప్పుని ఒప్పేసుకోవడంలో నిజాయితీ కనిపిస్తున్నా ఫైనల్ రన్ అవ్వకుండానే ఇలా చేయడం వల్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పాఠం నేర్చుకున్నామని చెప్పిన అనిల్ సుంకర ఇలాంటి పొరపాట్లు ఇకపై చేయమని ఏజెంట్ ని తన నిర్మాణ సంస్థని నమ్ముకున్న వాళ్ళందరూ క్షమించాలని కోరుకున్నారు. నష్టాల భర్తీకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మరింత కష్టపడతామని క్లారిటీ ఇచ్చారు
అంతా బాగానే ఉంది కానీ స్క్రిప్ట్ మీద అనుమానాలు ఉన్నప్పుడు షూటింగ్ వాయిదా వేయడమో లేదా వేరే కథను ఎంచుకోవడమో చెయాలి కానీ ఇలా ఎనభై కోట్ల పెట్టుబడిని రిస్క్ లో పెట్టడం వల్ల ఇప్పుడు బయ్యర్లు నష్టపోయారు. అఖిల్ ఇమేజూ దెబ్బతినే ప్రమాదం తలెత్తింది. ఒకవేళ దర్శకుడు సురేందర్ రెడ్డి భరోసా ఇచ్చి ఉంటే ఇంత అనుభవమున్న ప్రొడ్యూసర్ గా కథని సీరియస్ గా జడ్జ్ చేయాల్సింది. ఏది ఏమైనా డ్యామేజ్ జరిగిపోయింది. అఖిల్ శారీరక కష్టం, మమ్ముట్టి లాంటి స్టార్ల పాత్రలు, భారీ బడ్జెట్ అన్నీ కర్పూరమయ్యాయి. అనిల్ సుంకరకే కాదు ఇది అందరికీ పాఠమే
This post was last modified on May 1, 2023 6:24 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…