టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారిన ఏజెంట్ డిజాస్టర్ గురించి నిర్మాత అనిల్ సుంకర నాలుగో రోజే ఓపెనయ్యారు. ఒక సుదీర్ఘమైన ట్వీట్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించి తెరమీద కంటే ఆన్ లైన్లోనే పెద్ద ట్విస్టు ఇచ్చారు. అందులో బాగా హైలైట్ అవుతున్న పాయింట్ సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టామని, మధ్యలో కరోనా లాంటి ఇతర కారణాలు ప్రభావితం చేయడం వల్ల ఎంతో ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇకపై ఇలా జరగకుండా ఖచ్చితమైన ప్లానింగ్ తో ముందుకెళ్తామని ఎలాంటి సాకులు వెతకడం లేదని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు.
ఇది అభిమానుల మధ్యే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒక అగ్ర నిర్మాత సినిమా నాలుగో రోజు ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇలా బహిరంగంగా తప్పుని ఒప్పేసుకోవడంలో నిజాయితీ కనిపిస్తున్నా ఫైనల్ రన్ అవ్వకుండానే ఇలా చేయడం వల్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పాఠం నేర్చుకున్నామని చెప్పిన అనిల్ సుంకర ఇలాంటి పొరపాట్లు ఇకపై చేయమని ఏజెంట్ ని తన నిర్మాణ సంస్థని నమ్ముకున్న వాళ్ళందరూ క్షమించాలని కోరుకున్నారు. నష్టాల భర్తీకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మరింత కష్టపడతామని క్లారిటీ ఇచ్చారు
అంతా బాగానే ఉంది కానీ స్క్రిప్ట్ మీద అనుమానాలు ఉన్నప్పుడు షూటింగ్ వాయిదా వేయడమో లేదా వేరే కథను ఎంచుకోవడమో చెయాలి కానీ ఇలా ఎనభై కోట్ల పెట్టుబడిని రిస్క్ లో పెట్టడం వల్ల ఇప్పుడు బయ్యర్లు నష్టపోయారు. అఖిల్ ఇమేజూ దెబ్బతినే ప్రమాదం తలెత్తింది. ఒకవేళ దర్శకుడు సురేందర్ రెడ్డి భరోసా ఇచ్చి ఉంటే ఇంత అనుభవమున్న ప్రొడ్యూసర్ గా కథని సీరియస్ గా జడ్జ్ చేయాల్సింది. ఏది ఏమైనా డ్యామేజ్ జరిగిపోయింది. అఖిల్ శారీరక కష్టం, మమ్ముట్టి లాంటి స్టార్ల పాత్రలు, భారీ బడ్జెట్ అన్నీ కర్పూరమయ్యాయి. అనిల్ సుంకరకే కాదు ఇది అందరికీ పాఠమే
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…