తెలుగులో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే హీరోల్లో గోపీచంద్ ముందు వరుసలో ఉంటాడు. తెరపై అతను అగ్రెసివ్గా ఉండే పాత్రలు చేస్తూ.. విలన్ల మీద విరుచుకుపడుతుంటాడు కానీ.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు. మాట, ప్రవర్తన.. అన్నీ కూడా సున్నితంగా ఉంటాయి.
తన చుట్టూ ఎలాంటి వివాదాలూ కనిపించవు. అలాంటిది ‘రామబాణం’ సినిమాకు సంబంధించి దర్శకుడు శ్రీవాస్తో గోపీకి గొడవ జరిగినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. వీరి కలయికలో ఇంతకుముందు ‘లక్ష్యం’; ‘లౌక్యం’ లాంటి బ్లాక్బస్టర్లు వచ్చాయి. మూడోసారి ఈ జోడీ కలిసి చేస్తున్న ‘రామబాణం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే షూటింగ్ మధ్యలో ఔట్ పుట్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో గోపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
‘‘నేను, శ్రీవాస్ గొడవ పడ్డాం అన్నది వాస్తవం కాదు. నిజానికి నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. ఏదైనా నచ్చకపోతే అవతలి వ్యక్తికి చెప్పేస్తా. అతను వింటే సరే.. లేదంటే నేను పట్టించుకోకుండా వదిలేస్తా. నేను చెప్పాల్సింది మాత్రమే చెబుతా. శ్రీవాస్తో నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ‘రామబాణం’ సినిమా విషయానికి వస్తే.. మేకింగ్ టైంలో కొన్ని సీన్లు లెంగ్తీగా అనిపించాయి. ఇంత పెద్దగా తీయాల్సిన అవసరం లేదు అని శ్రీవాస్కు చెప్పా.
అతను అలా ఉన్నా పర్వాలేదని, ముందు తీసేద్దాం అని చెప్పాడు. అవసరం లేదనుకుంటే ఎడిటింగ్తో లెంగ్త్ తగ్గించవచ్చని.. ఒకవేళ తర్వాత అవి అవసరం అనుకున్నా తీయలేమని చెప్పాడు. తీరా చూస్తే ఎడిటింగ్లో ఆ సన్నివేశాలన్నీ లేచిపోయాయి. దీని విషయంలో మేమేమీ గొడవ పడలేదు. కానీ మీడియాలో మాత్రం పెద్ద గొడవ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండేవే’’ అని గోపీ వివరించాడు.
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…