వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయ్యిందని యూనిట్ టాక్. ఆగస్ట్ 11 విడుదలకు ఇంకో నాలుగు నెలలు టైం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఇవాళ మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా వివిధ భంగిమల్లో ఉన్న చిరు స్టిల్స్ ని పోస్టర్ల రూపంలో వదిలారు. టాక్సీ బయట రిలాక్స్ గా టీ తాగుతూ ఇచ్చిన భంగిమలు ఫ్యాన్స్ కి నచ్చేలాగే ఉన్నాయి. మొత్తం మూడు లుక్స్ ఒకే గెటప్, బ్యాక్ డ్రాప్ లో ఇచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ అసలే ఇది వేదాళం రీమేక్. అందులోనూ మెహర్ రమేష్ దర్శకుడు. ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ కి దీని మీద ఒకటే అనుమానాలు. డిజాస్టర్ల దెబ్బకు పదేళ్లకు పైగా దూరంగా ఉన్న ఇతను ఎలా డీల్ చేస్తాడనే భయం లేకపోలేదు. క్యాస్టింగ్ అంతా బాగానే ఉంది కానీ ఈ సంశయమే బజ్ ని పెంచలేకపోయిన మాట వాస్తవం. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న భోళా శంకర్ లో సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. చెల్లిగా నటిస్తున్న కీర్తి సురేష్ కు జోడిగా సుశాంత్ ని ఆల్రెడీ తీసుకున్నారు. తమన్నా మెయిన్ హీరోయిన్
ఒక ఐటెం సాంగ్ కోసం శ్రేయను సంప్రదిస్తే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో వెనక్కు తగ్గినట్టు ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ రిలీజ్ వాయిదా పడొచ్చనే ప్రచారం కూడా జరిగింది కానీ ఫైనల్ గా మరోసారి అదే డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ స్పష్టం చేశారు. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద సందీప్ వంగా అనిమల్, గదర్ 2 లతో పోటీ పడాల్సి ఉంటుంది. సిద్దు డీజే టిల్లు స్క్వేర్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. శివకార్తికేయన్ కూడా రేస్ లో ఉన్నాడు. చూడాలి మరి మెగాస్టార్ ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో
This post was last modified on May 1, 2023 11:38 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…