ఏజెంట్ ఫలితం చూశాక నిఖిల్ టీమ్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. స్పై కూడా ఇదే బ్యాక్ డ్రాప్ కావడంతో పరస్పరం రెండింట్లో ఉన్న పోలికలను సీరియస్ గా విశ్లేషించుకుంటున్నారట. గ్యారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ అసలు పూర్తయ్యిందో లేదో ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. 18 పేజెస్ తర్వాత నిఖిల్ బయట కనిపించడం తగ్గించేశాడు. కార్తికేయ 2 సక్సెస్ నిలబెట్టుకునే ఉద్దేశంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్న ఈ కుర్ర హీరో ఏ చిన్న పొరపాటు చేయకుండా కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు
ఇలాంటి కీలకమైన సమయంలో స్పైకు హైప్ రావడం చాలా కీలకం. ఏజెంట్ ని ప్రేక్షకులు తిరస్కరించిన తీరు మరీ అన్యాయంగా ఉంది. కనీసం ఆదివారం సగం ఫుల్స్ కూడా పెట్టలేనంత దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించనిది. అన్ని హంగులు, సురేందర్ రెడ్డి లాంటి సీనియర్ దర్శకుడు ఉన్నప్పటికీ ఇలా జరగడం వెనుక పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు అఖిల్ కన్నా ఎక్కువగా నిఖిల్ కే ఉంది. ఎనభై కోట్ల బడ్జెట్ బూడిదలో పోసినట్టు జరగడం కళ్ళముందే కనిపిస్తుంటే అదే జానర్ ని టచ్ చేస్తున్న హీరో ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే.
ఇంతకీ ఈ స్పై ఏ స్టేజిలో ఉందో వీలైనంత త్వరగా జనానికి చెప్పడం అవసరం. ఈ తరహా హై బడ్జెట్ మూవీస్ కి షూటింగ్ స్టేజి నుంచే ప్రమోషన్ అయ్యేలా ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నలిగేలా చేయాలి. కానీ స్పై విషయంలో అలా జరగడం లేదు. దీన్ని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. ఏజెంట్ ముందు అన్ని భాషల్లో అనుకున్నారు కానీ తీరా పనుల ఒత్తిడి వల్ల తెలుగు మలయాళంకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మిగిలిన లాంగ్వేజెస్ అవసరం లేకుండా పోయాయి. ఇవన్నీ స్పై పాఠాలుగా తీసుకుని ప్లాన్ చేసుకోవాల్సిందే
This post was last modified on April 30, 2023 9:46 pm
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా…
నిజమే… ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అవడానికి కొత్త పార్టీనే అయినా… దేశంలోని అన్ని రాజకీయ…
నియోజకవర్గాల పునర్విభజన అంశం.. దేశవ్యాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…