బాలీవుడ్ బాద్షాగా పిలుచుకునే షారుఖ్ ఖాన్ వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. తండ్రి పోలికను దాదాపు పుణికిపుచ్చుకున్న ఈ కుర్రాడికి సరైన కథలు దర్శకులు పడితే త్వరగానే పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఆ మేరకు రంగం సిద్ధం చేశారు. అయితే సినిమా నుంచి కాకుండా కాస్త విభిన్నంగా వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ డం అనే టైటిల్ తో ఆరు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
సినీ రంగాన్నే నేపధ్యంగా తీసుకుని రూపొందుతున్న స్టార్ డం విశేషమేమంటే ఆర్యన్ ఖాన్ కేవలం నటించడమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. గత డిసెంబర్ లోనే సోషల్ మీడియా వేదికగా తన తెరంగేట్రాన్ని సూచిస్తూ ఆర్యన్ ఒక ఫోటోని షేర్ చేశాడు. కానీ వివరాలేమీ పెట్టలేదు. అప్పటికే స్టార్ డం షూటింగ్ మొదలైపోయింది. కానీ మీడియాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ వచ్చిన షారుఖ్ త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చెప్పబోతున్నారు. ఈలోగా లీకుల రూపంలో ఈ సంగతి బయటికి రావడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది
స్టార్ కిడ్స్ ఇండస్ట్రీకి రావడం కొత్తేమి కాదు కానీ ఇలా స్వంతంగా డైరెక్ట్ చేస్తూ ప్రవేశించడం మాత్రం బహుశా మొదటిసారని చెప్పొచ్చు. ఖాన్ల ద్వయంలో సల్మాన్ కి అసలు పెళ్లి లేదు. అమీర్ ఖాన్ కు పిల్లలను పరిచయం చేసే విషయంలో ఏ ఆలోచన ఉందో గుట్టుగా ఉంది. టాప్ లీగ్ లో ఉన్న ఈ ముగ్గురి తర్వాత ఏర్పడే గ్యాప్ ని వాడుకునేందుకు ఆర్యన్ కు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, శత్రుఘ్నసిన్హా లాంటి వాళ్ళు కూతుళ్లను మాత్రమే తెరకు తీసుకొచ్చారు. షారుఖ్ వీళ్ళ కన్నా చాలా పెద్ద రేంజ్. అంత స్థాయిని కొడుకు అందుకుంటాడా లెట్ సీ
This post was last modified on April 30, 2023 9:45 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…