Movie News

SSMB28.. ఒక పాజిటివ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. దీనికి మొదట్నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ప్రతిసారీ ఏదో ఒక నెగెటివ్ ఈ చిత్రం విషయంతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందు ఒక కథ అనుకుని, షూటింగ్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి కొత్త కథ మీద త్రివిక్రమ్ వర్క్ చేయడం.. రకరకాల కారణాల వల్ల దీని షూటింగ్ మొదలుపెట్టడంలో ఆలస్యం జరగడం తెలిసిందే. చివరికి కొన్ని నెలల కిందట షూట్ మొదలైనా.. ఒకట్రెండు షెడ్యూళ్ల తర్వాత మళ్లీ బ్రేక్ పడింది.

తీసిన సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దీంతో షూట్ ఆపి మహేష్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి అన్నది ఎంత వరకు నిజమో కానీ.. మహేష్ అయితే ఇటీవలే ఫారిన్ ట్రిప్ వెళ్లడం మాత్రం వాస్తవం. ఇలా వరుసగా నెగెటివ్ న్యూస్‌లు వస్తుండటంతో మహేష్ అభిమానుల్లో కలవరం మొదలైంది.

ఎక్కడ ఈ సినిమాను మధ్యలో ఆపేస్తారో అన్న చర్చ కూడా నడుస్తోంది మహేష్ అభిమానుల్లో. ఇలాంటి టైంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అయ్యేలా ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాడు సీనియర్ నటుడు జగపతిబాబు. మహేష్ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర అదిరిపోతుందంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

“త్రివిక్రమ్ నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టిస్తాడు. నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలే రాస్తాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లో నా కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ సృష్టించాడు. ఆ పాత్రకు నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. జనాలు కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు దాని కంటే కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాం. మహేష్ సినిమాలో నా క్యారెక్టర్ బసిరెడ్డి పాత్ర కంటే చాలా వైల్డ్‌గా, భయంకరంగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా దాన్ని ఇష్టపడతారు” అని జగపతిబాబు తెలిపాడు. విలన్ పాత్ర బాగుంటే.. హీరో పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. సినిమాకు అది బాగా కలిసొస్తుంది. కాబట్టి జగపతిబాబు తన పాత్ర గురించి ఇలా చెప్పడం మహేష్ అభిమానులకు ఊరటనిచ్చేదే.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

7 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

1 hour ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago