సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. దీనికి మొదట్నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ప్రతిసారీ ఏదో ఒక నెగెటివ్ ఈ చిత్రం విషయంతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందు ఒక కథ అనుకుని, షూటింగ్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి కొత్త కథ మీద త్రివిక్రమ్ వర్క్ చేయడం.. రకరకాల కారణాల వల్ల దీని షూటింగ్ మొదలుపెట్టడంలో ఆలస్యం జరగడం తెలిసిందే. చివరికి కొన్ని నెలల కిందట షూట్ మొదలైనా.. ఒకట్రెండు షెడ్యూళ్ల తర్వాత మళ్లీ బ్రేక్ పడింది.
తీసిన సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దీంతో షూట్ ఆపి మహేష్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి అన్నది ఎంత వరకు నిజమో కానీ.. మహేష్ అయితే ఇటీవలే ఫారిన్ ట్రిప్ వెళ్లడం మాత్రం వాస్తవం. ఇలా వరుసగా నెగెటివ్ న్యూస్లు వస్తుండటంతో మహేష్ అభిమానుల్లో కలవరం మొదలైంది.
ఎక్కడ ఈ సినిమాను మధ్యలో ఆపేస్తారో అన్న చర్చ కూడా నడుస్తోంది మహేష్ అభిమానుల్లో. ఇలాంటి టైంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అయ్యేలా ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాడు సీనియర్ నటుడు జగపతిబాబు. మహేష్ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర అదిరిపోతుందంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
“త్రివిక్రమ్ నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టిస్తాడు. నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలే రాస్తాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లో నా కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ సృష్టించాడు. ఆ పాత్రకు నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. జనాలు కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు దాని కంటే కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాం. మహేష్ సినిమాలో నా క్యారెక్టర్ బసిరెడ్డి పాత్ర కంటే చాలా వైల్డ్గా, భయంకరంగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా దాన్ని ఇష్టపడతారు” అని జగపతిబాబు తెలిపాడు. విలన్ పాత్ర బాగుంటే.. హీరో పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. సినిమాకు అది బాగా కలిసొస్తుంది. కాబట్టి జగపతిబాబు తన పాత్ర గురించి ఇలా చెప్పడం మహేష్ అభిమానులకు ఊరటనిచ్చేదే.
This post was last modified on April 30, 2023 2:10 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…